KTR : తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభివృద్ధి చేయడం చేతకాదని, కేవలం వ్యవస్థలను కూల్చడం మాత్రమే తెలుసని ఆయన మండిపడ్డారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, ప్రభుత్వం నడపడం ఈ “సన్నాసుల” వల్ల కావడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి బూతుల భాష తప్ప మరే భాష రాదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో…
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. శనివారం ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ, రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. PhonePe కొత్త ఫీచర్.. ఒక క్లిక్తో చెల్లింపు.! ఎన్నికలకు నెల రోజుల…
Off The Record : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు గురించిన ఒక డిఫరెంట్, సెంటిమెంట్ అంశం ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దీని గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు. అందుకు ప్రధాన కారణం మంగళవారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ ఆ సీటు ఖాళీ అయిందని ప్రకటించడమే. కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతూ వచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఆమెను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం, ఆ…
కల్వకుంట్ల కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా అంశం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.. అయితే.. నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, తన రాజీనామా లేఖను ఇప్పటికే శాసనమండలి చైర్మన్కు సమర్పించారు. ఈ నేపథ్యంలో, సోమవారం శాసనమండలి వేదికగా ఆమె చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో, ఆ పార్టీ తరపున గెలిచిన పదవిలో కొనసాగడం…
వరంగల్ జిల్లా జనగామ వేదికగా జరిగిన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ, “కాలం వచ్చినప్పుడు కసిదీర కాటేయాలే” అనే మాటకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన ఉద్ఘాటించారు. పార్టీలో ఎటువంటి కీలక పాత్ర లేకపోయినా, కేవలం గౌరవంతో కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, కానీ ఆయన తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ద్రోహం…
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అత్యంత ఘాటుగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని కంటతడి పెట్టిస్తూ, ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత స్పష్టం చేశారు.…
Jagga Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల క్రెడిట్ , నీటి కేటాయింపులపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు తీరును , బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. హరీష్ రావు ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తుంటే, అన్నీ తనకే…
తెలంగాణ శాసనసభలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కంటే, చట్టసభలో మాట్లాడే మాటలకు ఎంతో విలువ , బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా, వారు సభకు రాకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకపోవడం విచారకరం గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత…
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ను సవరిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ శనివారం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా, గత కొన్ని దశాబ్దాలుగా అమలులో ఉన్న “ఇద్దరు పిల్లల నిబంధన”ను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. అంటే, ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వ్యక్తులు కూడా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో…