తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, పూర్తిగా నిర్బంధ పాలన సాగిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న రైతులను ఓదార్చడానికి,…
Off The Record: ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని ప్రచారం చేస్తోంది ఎవరు? తాను పార్టీ మారడం లేదు అని పదేపదే ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది? ఆయన కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా? ఈటలపై పార్టీలో అసలేం జరుగుతోంది? బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈమధ్య చేసిన కొన్ని కామెంట్స్ పై చర్చనే కాదు…సొంత పార్టీలోనే రచ్చ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. వివిధ సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అనుమానాలకు కారణమవుతున్నాయన్న డిస్కషన్ సాగుతోంది. ఆయన…
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మరో కీలక మలుపు తిరగబోతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, ఆమె పెట్టబోయే పార్టీ పేరుపై ఇన్నాళ్లూ సాగిన ఉత్కంఠకు తెర దించుతూ కవిత చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్త పార్టీ పేరు గురించి మొదటిసారి నోరు విప్పిన కవిత, తన పార్టీ “పాత…
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటిస్తూ, అవసరమైతే తాను ‘అసెంబ్లీ నక్సలైట్’గా మారుతానని, అందుకు వెనుకాడబోనని స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. హుజూరాబాద్ ప్రజలు ఏం పాపం చేశారని అక్కడ డంపింగ్ యార్డ్ పెడుతున్నారని ప్రశ్నించిన ఆయన, ఇది…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతల నడుమ రేపటికి వాయిదా పడింది. మున్సిపల్ హాల్ లోపల కౌన్సిలర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, బయట రాజకీయ పార్టీల శ్రేణుల వాగ్వాదాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చైర్మన్ ఎంపిక కోసం సభ్యులు చేతులు ఎత్తే క్రమంలో ఒక పార్టీ అభ్యర్థికి మద్దతుగా సభ్యులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…
Harish Rao: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడి చేశారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముమ్మాటికీ ఇది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో జరిగిన దాడి అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడి అన్నారు. పట్టపగలు అధికార మదంతో విర్రవీగుతూ సోయి మరచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరు బీహార్ గ్యాంగ్ను తలపిస్తోందన్నారు. ఏకంగా ప్రజా…
Ibrahimpatnam: గత కొన్ని రోజులుగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు ఈ మున్సిపాలిటీని భారత్ రాష్ట్ర సమితి(BRS) కైవసం చేసుకుంది. ఛైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి టేకుల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్పర్సన్గా బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామలను ఎన్నుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్నికలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ 55 రోజులు క్యాంప్ నిర్వహించిందని కాంగ్రెస్ ఆరోపించింది. ముగ్గురు కౌన్సిలర్లపై కోర్టులో…
తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్ కుంభకోణం , అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారాయి. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మైనింగ్ స్కామ్ నుండి తన వ్యక్తిగత పర్సనాలిటీ వరకు ప్రతి అంశంపై ఆయన క్లారిటీ ఇస్తూనే, అధికార పార్టీ తీరును తప్పుబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా అన్ని విషయాలను బయటపెట్టారని…
తెలంగాణలోని ప్రతిష్టాత్మక కాలేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే ప్రధాన కారణమని కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ స్పష్టం చేశారు. రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా కాలేశ్వరం నిర్మాణం, అందులో జరిగిన అవినీతి , సాంకేతిక లోపాలపై కేంద్రం ఘాటుగా స్పందించింది. Donald Trump: ఇరాన్కు హై లెవల్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక వినాశనమే.. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల…
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూనే, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై స్పష్టతనిచ్చారు. అసెంబ్లీ వేదికగా మీడియా ప్రతినిధులతో ముచ్చటించిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురాణాలను ఉదాహరణగా తీసుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో ప్రతిపక్షాల విమర్శలే తనను మరింత బలోపేతం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “రావణాసురుడు ఉండటం…