CM Revanth Reddy : జిల్లాల కుదింపు లేదు.. మూసీ ప్రాజెక్ట్ ఆగేది లేదు
- 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు.. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై సీఎం స్పష్టం
- డిలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం వద్దు.. ప్రస్తుత నిష్పత్తే కొనసాగాలి
- జిల్లాల కుదింపు లేదు.. కులగణన సామాజిక న్యాయానికి పునాది
- మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఆగదు.. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ ఘాటు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాజకీయ భవిష్యత్తు , జాతీయ స్థాయి ఎన్నికల విధానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో, 2029లో దేశవ్యాప్తంగా జరిగే సాధారణ ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో నియోజకవర్గాల విభజన, రాష్ట్రాల వాటాపై ఆయన తన గళాన్ని వినిపించారు.
రాబోయే డిలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన ఎంపీ స్థానాలను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న ఎంపీ స్థానాల నిష్పత్తి ప్రకారమే భవిష్యత్తులోనూ విభజన జరగాలని ఆయన డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించేలా కాకుండా, ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని కాపాడుతూనే నియోజకవర్గాల పెంపు ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను తగ్గించే ఆలోచన గానీ, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదన గానీ ప్రస్తుతానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేయడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు. అలాగే, రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే సామాజిక న్యాయం దిశగా ఒక కీలక అడుగు అని, ఇది భవిష్యత్తులో సమగ్ర అభివృద్ధికి పునాది వేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఆపే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. “ఎవరు సహకరించినా, సహకరించకపోయినా మేము మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం” అని ధీమా వ్యక్తం చేశారు. అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ పదవి ఆమోదం పొందకపోవడంపై స్పందిస్తూ, ఆ ప్రశ్నకు గవర్నర్ దగ్గరే సమాధానం ఉందని వ్యాఖ్యానించారు. అలాగే, అన్ని కులాలు తనను సొంత మనిషిగా భావిస్తున్నాయని, కేవలం శర్మలు మాత్రమే ఇంకా తనను ఓన్ చేసుకోలేదని చమత్కరించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలపై రేవంత్ రెడ్డి సూటిగా స్పందించారు. “అధికారం ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం కలిసి ఉంది.. అధికారం కోల్పోగానే విడిపోయారు” అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. “మన ఇంట్లో ఉన్న ఆడపిల్లను మనం గౌరవంగా చూసుకుంటే, బయట వారు మన గురించి మాట్లాడే అవకాశం ఉండదు. ఇంట్లో సమస్యను వాళ్లే పరిష్కరించుకోలేనప్పుడు బయట వ్యక్తులు ఎందుకు వస్తారు?” అని ప్రశ్నించారు. తనకు వయసు తక్కువైనా, ఈ రాజకీయ పరిణామాలు తనకు ఎంతో అనుభవాన్ని ఇచ్చాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!