Harish Rao: 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తాజాగా ఆయన సంగారెడ్డి సెంట్రల్ జైలు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా తమ కార్యకర్తలని జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఓ సీటు ఎక్కువ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. మైనారిటీ…
Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన…2024 జూలై 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక కొన్ని రోజులుగా మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో…పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదిపారు. బహిరంగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయకున్నా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి,…
Balka Suman Arrest: మంత్రి వివేక్ వెంకట స్వామి కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావారణం కొనసాగుతోంది. పోలీసులు గేటు తీసుకుని లోపలికి వెళ్లే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు హైకోర్టు మెట్లెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ ఎన్నికపై కీలకమైన స్టే విధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం దీనిపై తుది విచారణ జరగనుంది. ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల…
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయి, మళ్లీ ‘క్యాంపు’ రాజకీయాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నేడు (ఫిబ్రవరి 17) క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఎన్నిక ప్రారంభమయ్యే సమయంలో…
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సింది పోయి, ఓటమిని జీర్ణించుకోలేని కొందరు అభ్యర్థులు ఏకంగా ఓటర్లపైనే దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి స్వరూపరాణి ఓటమి పాలయ్యారు. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె , ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి…
Janasena: ఏపీకే పరిమితమైందని భావించిన జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జనసేన అభ్యర్థి ఘన విజయం సాధించారు.
TG Municipal Elections Live Updates: తెలంగాణలో పురపోరు తుది ఘట్టానికి చేరుకుంది. నేడు ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 3 నుంచి 8 రౌండ్లలో ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది.. తరువాత సాధారణ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఫలితాలపై సర్వత్రా…
Harish Rao Challenges CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రేవంత్ కోటి రూపాయల పరిహారం ఇస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. తాజాగా సంగారెడ్డి పర్యటనలో ఆయన ప్రసంగించారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవ్వరు పట్టించుకోలేదని.. ఘటన జరిగిన వెంటనే తాను వచ్చి పరిశీలిస్తే మర్నాడు సీఎం రేవంత్ వచ్చారని విమర్శించారు.
Pawan Kalyan: ఈ నెల 11న జరగనున్న తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ జనసేన నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కీలక దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు, అలాగే బీజేపీ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షుడు బొంగునూరి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామ్…