KTR: ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ జరిగిందో వాస్తవాలు చెప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ధారావాహిక సీరియల్ మాదిరి ఫోన్ ట్యాపింగ్ కేసు నడిపిస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని నిన్నటి విచారణలో కేసీఆర్ చెప్పారు.. హరీష్ రావుకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.
BRS MLA Kaushik Reddy Apologises to Telangana IPS Officers Association: తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు, అధికారులు అంటే తనకు గౌరవం ఉందని.. తాను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. "నేను ఉద్దేశ్యపూర్వకంగా అన్న మాటలు కాదు.. మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు.. రేవంత్ రెడ్డి ప్రోత్బలంతో నాపై, నా…
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది వరుసగా బిఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించి.. ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసులో సిట్ కోరింది. అయితే, ఈ సిట్ నోటీసులపై కేసిఆర్ స్పందించారు. ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేనని తేదీని వాయిదా వేయాలని కోరారు.…
Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణను వేగవంతం చేసిన ప్రత్యేక విచారణ బృందం (SIT), ఇప్పుడు నేరుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR)ను విచారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. Nani : నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు కానుకగా ‘ది పారడైస్’ బిగ్ సర్ప్రైజ్ అందిన సమాచారం ప్రకారం.. కేసీఆర్కు నోటీసులు అందజేసేందుకు సిట్ అధికారులు…
Notice To Danam Nagender: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. MS Dhoni: అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఐపీఎల్ 2028లో కూడా ఎంఎస్ ధోనీ! ఈ నెల 30వ తేదీన ఉదయం స్పీకర్…
ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగిస్తారా..? ఇప్పటికే 8మందిని విచారించగా ఆ ఇద్దరి దగ్గరే ఎందుకు ఆగింది? ఎవరా శాసన సభ్యులు? ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది విచారణ ముగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో ఏడుగురికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ మీదున్న అనర్హత…
KTR: కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది.. కానీ సిట్ విచారణకు మాత్రం ముగింపులేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్ సిరిసిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. టీవీ సీరియల్ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా…
Harish Rao: కేటీఆర్కి సిట్ నోటీసులపై హరీష్రావు ఫైర్ అయ్యారు. నోటీసులు నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు ఇస్తే రేవంత్ ప్రజల ఖాతా నుంచి తీసుకుంటా అంటున్నారని ఆరోపించారు.
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతల స్వీకారంతో సంబరాలు చేసుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మంచి ఆర్గనైజర్, చత్తీస్గఢ్లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. న్నిన్న ఏబీఎన్లో అర్థం పర్థం లేని ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని స్పష్టం చేశారు..