Kondigari Ramulu: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రెండు పర్యాయములు సీపీఎం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందని ఎమ్మెల్యే కొండి గారి రాములు కన్ను మూశారు. 1989,1994లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పేరుందిన నిజాయితీగల ఎమ్మెల్యేగా రాములు ఒక వెలుగు వెలిగారు. ఈరోజు ఉదయం కొండి గారి రాములు(91) తుది శ్వాస విడిచారు. ఆయన స్వగ్రామం మంచాల మండలం ఆరుట్ల 1935వ సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుంచి కమ్యూనిస్టు భావాజాలం కలిగి ఉన్న ఈయన తొలిసారిగా 1989లో ఎమ్మెల్యేగా…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు మహిళా విభాగంలో చిచ్చు రేపింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించడంతో, ఇప్పటివరకు ఆ బాధ్యతల్లో ఉన్న సునీతారావు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ కోసం సుదీర్ఘకాలం పనిచేసిన తనకు తగిన గుర్తింపు ఇవ్వకుండా పక్కన పెట్టడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చాలా కాలంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో మార్పు ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, సునీతారావు తన పట్టును నిలుపుకుంటూ వచ్చారు.…
Off The Record: తెలంగాణ కాంగ్రెస్కు కొరకరాని కొయ్యగా మారారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కంటే ఎక్కువగా ఆయనే పార్టీని ఇరుకున పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట గాంధీభవన్ వర్గాల్లో. అందుకు తగ్గట్టే… జగిత్యాల పరిణామాలతో అవకాశం దొరికినప్పుడల్లా… సొంత పార్టీ నేతలపై విరుచుకు పడుతున్నారాయన. నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణల్లో భాగంగా…. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కు దగ్గరయ్యారు ఎమ్మెల్యే సంజయ్.వరుసగా రెండుసార్లు తనని ఓడించిన సంజయ్…. తన పార్టీకే చేరువ కావడం…
Off The Record: తెలంగాణలో.. ఆ మాటకొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్. ప్రస్తుతం ఇది గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్స్గా విడిపోయింది. అదంతా ఒక ఎత్తయితే… త్వరలో ఇక్కడ జరగబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు జాగ్రత్తగా పావులు కదుపుతున్నాయి. ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందన్న క్లారిటీ రాక ముందే…ఎవరి ప్లానింగ్లో వాళ్ళు ఉన్నారు. ఇక రూరల్ తెలంగాణ కంటే… హైదరాబాద్ చుట్టు పక్కలే తమకు…
Harish Rao: 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తాజాగా ఆయన సంగారెడ్డి సెంట్రల్ జైలు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా తమ కార్యకర్తలని జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఓ సీటు ఎక్కువ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. మైనారిటీ…
Off The Record: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం. గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆయన…2024 జూలై 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక కొన్ని రోజులుగా మళ్లీ బీఆర్ఎస్లోకి వచ్చేందుకు రెడీ అయ్యారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు రావడంతో…పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదిపారు. బహిరంగంగా బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయకున్నా ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి,…
Balka Suman Arrest: మంత్రి వివేక్ వెంకట స్వామి కాన్వాయ్పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో బాల్క సుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత వాతావారణం కొనసాగుతోంది. పోలీసులు గేటు తీసుకుని లోపలికి వెళ్లే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వ్యవహారం మలుపుల మీద మలుపులు తిరుగుతూ చివరకు హైకోర్టు మెట్లెక్కింది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, ఒక కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ ఎన్నికపై కీలకమైన స్టే విధించింది. బుధవారం (ఫిబ్రవరి 18) ఉదయం దీనిపై తుది విచారణ జరగనుంది. ఈ వివాదం వెనుక ఉన్న ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీకి చెందిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల…
క్యాతనపల్లి మున్సిపాలిటీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయి, మళ్లీ ‘క్యాంపు’ రాజకీయాలు మొదలయ్యాయి. షెడ్యూల్ ప్రకారం నేడు (ఫిబ్రవరి 17) క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే, ఎన్నిక ప్రారంభమయ్యే సమయంలో…
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కొన్నిచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటరు తీర్పును గౌరవించాల్సింది పోయి, ఓటమిని జీర్ణించుకోలేని కొందరు అభ్యర్థులు ఏకంగా ఓటర్లపైనే దాడులకు దిగుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఒక విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. భువనగిరి మున్సిపాలిటీ ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి స్వరూపరాణి ఓటమి పాలయ్యారు. తమకు ఓటు వేయలేదన్న కోపంతో ఆమె , ఆమె కుటుంబ సభ్యులు అర్ధరాత్రి…