ఆ ఇద్దరు ఎమ్మెల్యేల విచారణ ఎప్పుడు..? సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ విచారణ ముగిస్తారా..? ఇప్పటికే 8మందిని విచారించగా ఆ ఇద్దరి దగ్గరే ఎందుకు ఆగింది? ఎవరా శాసన సభ్యులు? ఎపిసోడ్కు ఎండ్ కార్డ్ పడేది ఎప్పుడు? తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 8 మంది విచారణ ముగించారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అందులో ఏడుగురికి సంబంధించి జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ మీదున్న అనర్హత…
KTR: కార్తీక దీపం సీరియల్ కూడా ముగిసింది.. కానీ సిట్ విచారణకు మాత్రం ముగింపులేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్ సిరిసిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్.. పాలన చేతకాక అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. టీవీ సీరియల్ను తలపించేలా డ్రామాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. పంచాయతీ ఎన్నికల తర్వాత జిల్లా…
Harish Rao: కేటీఆర్కి సిట్ నోటీసులపై హరీష్రావు ఫైర్ అయ్యారు. నోటీసులు నేపథ్యంలో గురువారం మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైబర్ నేరగాడికి పెద్ద తేడా లేదని తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజలకు ఇస్తే రేవంత్ ప్రజల ఖాతా నుంచి తీసుకుంటా అంటున్నారని ఆరోపించారు.
బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నికయ్యారు. ఆయన బాధ్యతల స్వీకారంతో సంబరాలు చేసుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. మంచి ఆర్గనైజర్, చత్తీస్గఢ్లో పార్టీని ఒంటిచేత్తో గెలిపించారంటూ గొప్పగా చెప్పుకుంటున్నారు.
Bhatti Vikramarka: ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్ అయ్యారు. న్నిన్న ఏబీఎన్లో అర్థం పర్థం లేని ఓ కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఈ బాధ్యతలో ఉన్నంతకాలం ఏ గద్దలను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వనని స్పష్టం చేశారు..
Bhatti Vikramarka: బొగ్గు గనుల కోసమే అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురించడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ సీరియస్ అయ్యారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. తన పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారన్నారు.. ఒక లక్ష్యం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని.. ఆస్తులు సంపాదించేందుకు, హోదా అనుభవించేందుకు రాజీకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు.. ఆస్తులను, వనరులను సమాజంలోని అన్ని వర్గాలకు అందేలా చేయడమే తన లక్ష్యమన్నారు. తన జీవితం పూర్తి పారదర్శకంగా ఉంటుందని..…
Secunderabad: సికింద్రాబాద్ చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. సికింద్రాబాద్కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్కు మద్దతుగా ‘సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
MP Arvind: శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూర్గా పేర్కొన్న ఆయన.. ఆ పేరు ఎలా వచ్చిందో చారిత్రిక ఆధారాలు ఉన్నాయన్నారు. తాజాగా మీడియాలో మాట్లాడిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు.. నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇందూర్గా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్ షిప్ ఉందని అనుమానం…
MLA Defection Case: తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఇదే చివరి అవకాశం అంటూ కోర్టు స్పష్టమైన హెచ్చరికలు చేసింది. ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఈలోపే నిర్ణయం తీసుకోవాల్సి ఉండేదని ధర్మాసనం పేర్కొంది. ఇకపై కూడా నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే తగిన పరిణామాలు తప్పవని సుప్రీంకోర్టు స్పీకర్కు హెచ్చరించింది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. Vijay…
Kishan Reddy: తెలంగాణలో జర్నలిస్టుల అక్రమ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికమని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్ట్ విషయంలో తలెత్తిన వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (SIT) ఇంకా విచారణ జరుపుతూనే ఉందని.. ఇంతలోపే రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి,…