వైష్ణవి హత్య కేసులో వీడని సస్పెన్స్: కడప జిల్లా గండికోటలో జరిగిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో సస్పెన్స్ ఇంకా వీడలేదు. విద్యార్థిని హత్యపై అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. సోమవారం (జులై 14) ఉదయం 8.30 గంటలకు గండికోటకు చేరుకున్న వైష్ణవి, లోకేశ్.. 10:40 గంటలకు లోకేశ్ ఒక్కడే తిరిగి వెళ్లినట్లు సీసీ కెమెరాలు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో వైష్ణవి హత్య జరిగినట్లు వైద్యులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. హత్య…
నేడు తాడేపల్లిలో వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్.. ఉదయం 11 గంటలకు రైతు సమస్యలు, అక్రమ అరెస్టులు, పర్యటనలపై ఆంక్షలు వంటి వాటిపై జగన్ మాట్లాడే అవకాశం ఈరోజు సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక ప్రక్రియ.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఉప ఎన్నిక ప్రక్రియ.. ఎన్నికలు బహిష్కరించే ఆలోచనలో వైసీపీ ఎంపీటీసీలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్ది.. 5 కోట్ల రూపాయల నిధులతో పలు…
Maoists : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకూభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలంగా…
Posters : ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలుసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, వారికి మార్గదర్శనం చేసేలా ఉన్నాయి. ఈ పోస్టర్లలో మావోయిస్టు సిద్ధాంతాన్ని సూటిగా ప్రశ్నిస్తూ – “సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా… మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?” అని ప్రశ్నించారు. అంతేగాక, నాలుగు…
Tragic : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ రోజు ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన…
Telangana High Court : తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. కొలిజియం చేసిన సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడంతో ఈ బదిలీ అమలులోకి వచ్చింది. జూలై 14, 2025న విడుదల చేసిన కేంద్ర నోటిఫికేషన్ ప్రకారం నాలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు జరగనున్నాయి. Ravindra Jadeja:…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం గుర్తింపు అన్నారు. ఆకలి తీర్చే ఆయుధమని తెలిపారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నల్గొండ చరిత్రే.. తెలంగాణ చరిత్ర అని కొనియాడారు.
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. గుండె నొప్పితో ఇంటర్ సెకండియర్ విద్యార్థి మృతి చెందాడు. ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బత్తిని మనితేజ (17) గుండె నొప్పితో మృత్యుఒడికి చేరుకున్నాడు. మణితేజ స్వగ్రామం శాయంపేట మండలం ప్రగతి సింగారం.
ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్కు భారీ ధర దక్కింది. రూ.11.5…