సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్లో చెలరేగిన వివాదం.. ఇద్దరు స్నేహితుల మధ్య చిలికి చిలికి గాలివానలా మారింది. హైదరాబాద్ చిలుక నగర్లో అత్యంత దారుణంగా స్నేహితున్ని మర్డర్ చేసే స్థాయికి వెళ్లింది. చనిపోయిన వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ కావడంతో పోలీసులు ఈ కేసును కేవలం 8 గంటల్లోనే ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఇంతకీ హంతకులు ఎవరు? వాట్సాప్ చాట్ వివాదానికి ఎందుకు దారి తీసింది? చిలుకా నగర్ చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన సుధీర్…
Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. ప్రేమించిన వాడిని మర్చిపోకపోవడంతో కూతురిని చంపేయాలని కన్నతండ్రే ఇలా చేస్తాడు. అచ్చం అలాంటి ఘటన కామారెడ్డి జిల్లా పోచారంలో చోటు చేసుకుంది. ఇక్కడ విలన్ తండ్రి కాదు.. పెళ్లి ఫిక్స్ అయిన యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిన యువతికి యువకుడు ఎయిడ్స్ రక్తాన్ని ఎక్కించాడు. యువకుడితో పాటు తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉంది. పోచారానికి చెందిన యువకుడి మనోహర్తో యువతికి…
Jagtial Murder: అది జగిత్యాల పట్టణం. ఓ వైపు శివరాత్రి.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక హడావుడి. పట్టణంలో ఎక్కడ చూసినా గందరగోళ వాతావరణం ఉంది. ఈ సందట్లో.. నడిరోడ్డుపైనే అత్యంత దారుణంగా ఓ యువకున్ని చంపేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడ వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారు. వివాహేతర సంబంధం కారణంగా జగిత్యాలలో ఆదివారం పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బోరే విశ్వనాథ్ అనే యువకుడు…
Nacharam: నాచారంలో దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో భర్తను రాడ్డుతో కొట్టి హత్య చేసింది భార్య. ఆమెకు ఓ వివాహేతరుడు సహకరించాడు. ఈ ఘటన నాచారం మల్లాపూర్ ప్రాంతంలో కలకలం రేపింది. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా, అతని భార్య బంధిత బెహరా కొన్నేళ్లుగా నాచారం మల్లాపూర్లో కిరాయికి నివాసం ఉంటున్నారు. నారాయణ్ బెహరా ప్లంబర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య బంధిత ఇంటి పనులు చూసుకుంటూ ఉండేది.…
Jayashankar Bhupalpally: భార్యను చంపి తాను ఉరివేసుకొని చనిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చోటు చేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి(50) తన భార్య సంధ్య(42)ను తాడుతో ఉరిబెట్టి చంపేశాడు. అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, కూతురు వేధింపులు తాళలేక ధర్మపత్నిని చంపిన అనంతరం వీడియో తీసి స్టేటస్ పెట్టుకున్నాడు బాలరాజు రామాచారి..
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు…
కూకట్ పల్లి పీఎస్ పరిధిలో రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. జార్ఖండ్ వెళ్లిన స్పెషల్ టీం నిందితులను జార్ఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను హైద్రాబాద్ కు తరలిస్తున్నారు. పోలీసులు టెక్నికల్, ఇతర ఏవిడెన్స్ ఆధారంగా నిందితుల జాడ కనుగొని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. ఘటన రోజు రేణు ఇంట్లో ఒంటరిగా ఉండగా…
నిజామాబాద్ జిల్లా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష ఘటన మరువకముందే మరో ఎం.బి.బి.ఎస్. విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. 2020 బ్యాచ్ కు చెందిన సనత్ మెడికల్ కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.