Renu Agarwal Murder: రేణు అగర్వాల్ మర్డర్ కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- రేణు అగర్వాల్ మర్డర్ కేసు
- సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు అగర్వాల్ అనే మహిళను స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రోషన్ & హర్ష అనే నిందితులు హత్య చేశారు.. హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరాడు..
Also Read:Anakapalli: అనకాపల్లిలో కూతురితో ప్రేమ.. అరుణాచలంలో యువకుడు దారుణ హత్య..
Also Read
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Vaibhav Sooryavanshi: వైభవ్ క్రేజ్ మాములుగా లేదుగా.. క్షణాల్లో అమ్ముడుపోయిన టికెట్లు..
- SIP Investment: నెలకు రూ.20 వేల పెట్టుబడితో.. రూ.1 కోటి సంపాదించండి.. ఎలా అంటే..
- Bullet Trains: హైదరాబాదీలకు గుడ్న్యూస్.. బుల్లెట్ ట్రైన్ కారిడార్లు ప్రకటించిన కేంద్రం
రోషన్ అదే అపార్ట్మెంట్ లో పై అంతస్తులో పని చేస్తాడు.. ఇద్దరు రాంచీ కి చెందిన వారు.. 2023 లో రోషన్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి.. రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు బంగారం ఉన్నాయి అని నిందితులు తెలుసుకున్నారు.. రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లగానే పదో తేదీన కుక్కర్ తో ఆమె తలపై మోదారు.. ఆ తర్వాత ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయారు.. 7 తులాల బంగారు ఆభరణాలు.. పది వాచ్ లు, రోల్డ్ గోల్డ్ వాచ్ లు దొంగతనం చేశారు.. 8 వ తేదీ నుండి దోపిడీకి ప్లాన్ చేసుకున్నారు.. ఆ తర్వాత మహిళను హత్య చేసి దోచుకుని పరారయ్యారు.
వెంటనే టీం లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టాం.. ఇద్దరు నిందితులు పరిచయస్తులు.. నిన్న ఇద్దరు రాంచీ వద్ద పట్టుబడ్డారు..హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడు.. గతంలో కోల్కతా రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకున్నాడు.. ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నాం.. దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయ పడ్డారు.. నిందితులు ఇద్దరు మర్డర్ అనంతరం హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నారు..
Also Read:RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
టివిలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ ఇన్పుట్ ఇచ్చాడు.. ఆ ఇన్పుట్ కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నాము.. నిందితులు హఫీజ్ పేట్ నుండి సికింద్రాబాద్ కు MMTS టికెట్లు తీసుకున్నారు.. స్టేషన్ లో పోలీసులను చూసి హఫీజ్ పేట్ నుండి బయటకు క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారు.. రాత్రి ఒంటి గంటకు హఫీజ్ పేట్ నుండి క్యాబ్ లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు దిగారని తెలిపారు. జార్ఖండ్ లో నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించామని వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
The India Story: మనం తినేది అన్నమా? విషమా?.. భయపెడుతున్న ‘ది ఇండియా స్టోరీ’ టీజర్
-
Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
-
IAS Transfers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
-
Deewana: సినిమా నచ్చి బై వన్ గెట్ వన్ ఆఫర్ ప్రకటించిన హీరో శ్రీ విష్ణు
-
Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!