Renu Agarwal Murder: రేణు అగర్వాల్ మర్డర్ కేసు.. సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- రేణు అగర్వాల్ మర్డర్ కేసు
- సంచలన విషయాలు వెల్లడించిన సైబరాబాద్ సీపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్ పల్లిలో అత్యంత దారుణంగా అత్యంత దారుణంగా హత్యకు గురైంది రేణు అగర్వాల్ అనే మహిళ. ఇంట్లో పనికి చేరిన వాళ్లే డబ్బు, నగలు కాజేసేందుకు మహిళ ప్రాణాలు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి సంచలన విషయాలు వెల్లడించారు. సైబరాబాద్ సీపీ మాట్లాడుతూ.. కూకట్ పల్లి పీఎస్ లిమిట్స్ లో పదో తేదీన రేణు అగర్వాల్ మర్డర్ జరిగింది.. రేణు అగర్వాల్ అనే మహిళను స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రోషన్ & హర్ష అనే నిందితులు హత్య చేశారు.. హర్ష కొద్ది రోజుల క్రితమే రేణు అగర్వాల్ ఇంట్లో పనికి కుదిరాడు..
Also Read:Anakapalli: అనకాపల్లిలో కూతురితో ప్రేమ.. అరుణాచలంలో యువకుడు దారుణ హత్య..
Also Read
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
రోషన్ అదే అపార్ట్మెంట్ లో పై అంతస్తులో పని చేస్తాడు.. ఇద్దరు రాంచీ కి చెందిన వారు.. 2023 లో రోషన్ పై మూడు కేసులు నమోదు అయ్యాయి.. రేణు అగర్వాల్ ఇంట్లో డబ్బులు బంగారం ఉన్నాయి అని నిందితులు తెలుసుకున్నారు.. రేణు కుమారుడు, భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లగానే పదో తేదీన కుక్కర్ తో ఆమె తలపై మోదారు.. ఆ తర్వాత ఆమె కాళ్లు చేతులు కట్టేసి ఇంట్లో ఆభరణాలు తీసుకుని వెళ్ళిపోయారు.. 7 తులాల బంగారు ఆభరణాలు.. పది వాచ్ లు, రోల్డ్ గోల్డ్ వాచ్ లు దొంగతనం చేశారు.. 8 వ తేదీ నుండి దోపిడీకి ప్లాన్ చేసుకున్నారు.. ఆ తర్వాత మహిళను హత్య చేసి దోచుకుని పరారయ్యారు.
వెంటనే టీం లను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టాం.. ఇద్దరు నిందితులు పరిచయస్తులు.. నిన్న ఇద్దరు రాంచీ వద్ద పట్టుబడ్డారు..హర్ష మత్తు పదార్థాలు సేవిస్తాడు.. గతంలో కోల్కతా రీహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స తీసుకున్నాడు.. ఈ కేసులో రోషన్ సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నాం.. దోచుకున్న ఆభరణాలు దాచడానికి అతను సహాయ పడ్డారు.. నిందితులు ఇద్దరు మర్డర్ అనంతరం హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు.. అక్కడ క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా రాంచీ చేరుకున్నారు..
Also Read:RBI: ఫోన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానా.. ఎందుకంటే.
టివిలో వస్తున్న వార్తలు చూసి క్యాబ్ డ్రైవర్ ఇన్పుట్ ఇచ్చాడు.. ఆ ఇన్పుట్ కన్ఫర్మేషన్ అనంతరం రాంచీ వెళ్ళి నిందితులను అదుపులోకి తీసుకున్నాము.. నిందితులు హఫీజ్ పేట్ నుండి సికింద్రాబాద్ కు MMTS టికెట్లు తీసుకున్నారు.. స్టేషన్ లో పోలీసులను చూసి హఫీజ్ పేట్ నుండి బయటకు క్యాబ్ బుక్ చేసుకుని రాంచీ వెళ్లారు.. రాత్రి ఒంటి గంటకు హఫీజ్ పేట్ నుండి క్యాబ్ లో బయలుదేరి ఉదయం తొమ్మిది గంటలకు దిగారని తెలిపారు. జార్ఖండ్ లో నిందితులను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించామని వెల్లడించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Duleep Trophy 2026: డ్రాగా ముగిసిన దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్.. ఈస్ట్ జోన్దే టైటిల్!
-
Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
-
Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్కు లక్కీ ఛాన్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?