కేంద్ర ప్రభుత్వనికి తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా ట్రైబ్యునల్ లో కేటాయింపులు లేవని.. వరద జలాల ఆధారంగా ఆ ప్రాజెక్టును చేపట్టారని లేఖ లో పేర్కొన్నారు. వెలిగొండకు అనుమతులు లేవన్నారు. ఆ ప్రాజెక్టు ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీరు తరలిస్తున్నారని.. ఈ అంశం పై గతంలోనే ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేని ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులివ్వడం పై ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేసింది తెలంగాణ సర్కార్. ఇది…
తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల చేసింది. దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు కోసం హుజూరాబాద్ ప్రారంభోత్సవం సభలో ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ. 2000 కోట్ల నిధుల లక్ష్యం, నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకున్నది. అయితే దళిత…
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఉత్కంఠ రేపుతోంది. ఎవరికి వారే తమ తమ వాటాల కోసం పట్టుబడుతుండడంతో ఈ పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. మరోవైపు ఇటీవల సమావేశాలకు హాజరుకాని తెలంగాణ… సెప్టెంబర్ 1న జరిగే KRMB మీటింగ్కు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈసారి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే ఈ సమావేశానికి వెళ్లనున్నారు. న్యాయంగా రావాల్సిన కృష్ణా జలాల్లో ఒక్క బొట్టుకూడా వదులుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో…
ఇది పాదయాత్రల సీజన్. తెలంగాణలో మరో పాదయాత్రకు ముహూర్తం కుదిరింది. ఇందిరా శోభన్ తాజాగా ఈ లిస్టులో చేరిపోయారు. ఇటీవలషర్మిల పార్టీకి గుడ్బై చెప్పిన ఆమె మీడియా ముందుకు వచ్చారు. తన ఫ్యూచర్ ప్లాన్ ఏమిటో వివరించారు. ముందు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తారు. పాదయాత్రలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపటమే ఆమె టార్గెట్. టీఆర్ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానలపైనే తన పోరాటమంటున్నారు ఇందిరా శోభన్. ఆమె తలపెట్టిన పాదయాత్ర పేరు ఉపాధి భరోసా…
తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు పూనుకుంటోంది. వ్యాక్సిన్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ముగిసిందని ప్రకటించిన రాష్ట్ర వైద్యశాఖ.. థర్డ్ వేవ్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అంతేకాదు 18ఏళ్లు పైబడిన వారంతా వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తోంది. లేకపోతే పబ్లిక్ ప్లేస్ లలో తిరిగేందుకు అనుమతి ఉండకపోచ్చంటోంది. తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో.. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం…
గత మూడు నెలలుగా హుజురాబాద్ కి చీకటి అధ్యాయంగా పోలీసులు నిర్బంధం చవి చూస్తున్నది. నా రాజీనామా తర్వాత ఏ నిబంధన ప్రకారం ఏ చట్టం ప్రకారం ఇతర ప్రాంతాల వారిని ప్రోటోకాల్ సంభందము లేకుండా ఇంఛార్జ్లు వచ్చారు. హుజురాబాద్ ప్రజలపై తోడేళ్ళు గా విరుచుకుపడుతున్నారు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఈటల మాట్లాడుతూ… బీజేపీ కార్యకర్తలపై నాయకులపై నిరంతరం ఫోన్ ట్యాపింగ్ లు చేయడం నిఘా పెట్టడం చేస్తున్నారు…
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే…
టీఆర్ఎస్ పార్టీ కి ఇంద్రవెల్లి సభతో చురుకు తగిలింది. కలుగులో నుంచి ఒకొక్కరు బయటకు వస్తున్నారు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి… నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు సరికాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు కత్తులు…కటారులు పట్టుకుని తిరుగుతున్నారా…నాలుకలు కోస్తాం అంటున్నారు.. మాకు కత్తులు దొరకవా…. మేము నాలుకలు కోయలేమా. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం…. మీరు జైలుకు వెళ్లడం తథ్యం అని తెలిపారు. ఇప్పుడు ప్రతి పక్షంగా…. మేము ప్రశ్నిస్తాము. వివరణ ఇచుకోవాల్సిన బాధ్యత…
కృష్ణా నది వాటాలో 34శాతానికే కేసీఆర్ సంతకం చేశారు. అపెక్స్ కౌన్సిల్, కృష్ణా, గోదావరి సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. కృష్ణా నదిపైన మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు అని బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ప్రగతి పద్దుతో దళితుల అభ్యున్నతికి కట్టబడి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రగతి పద్దును పూర్తిగా వినియోగించలేదు. 1,91,000 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి…
వృద్ధాప్య పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. వయోపరిమితిని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 65 ఏళ్ల వయోపరిమితిని 57 ఏళ్లకు కుదించింది సర్కార్.. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సును 65 ఏండ్ల నుండి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో 36, తేదీ: 04-08-2021 ను విడుదల చేసింది.. ఇకపై అర్హులైన 57 ఏళ్ల వారందరికీ కొత్త పెన్షన్లు అందనున్నాయి. వెంటనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను…