హుజురాబాద్ లో కారు దూసుకెళ్తుందా…? కమలం వికసిస్తుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ లో కారు దూసుకెళ్తుందా…? కమలం వికసిస్తుందా.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. మరోసారి గెల్చి సిట్టింగ్ సీటు దక్కించుకుంటామని అధికార పార్టీ చెబుతుంటే.. ఈటల గెలుపు పక్కా అనే ధీమాతో ఉంది కమలం పార్టీ. అయితే ఇరుపార్టీలు భారీగా డబ్బులు పంచినా.. తమ ఓట్లు తమకే పడ్డాయని కాంగ్రెస్ చెబుతోంది.బీజేపీ, trs మధ్య హోరా హోరీగా సాగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరి కొన్ని గంటల్లో వెలువడనుంది. 5 నెలల పాటు ఇరుపార్టీలు హోరాహోరీ ప్రచారం నిర్వహించాయి. ఓటరు తమవైపు ఉన్నాడంటే, తమవైపు ఉన్నాడంటూ ఊదరగొట్టాయి.
ఇప్పుడు ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడనుంది. మరోవైపు..సామాజిక సమీకరణాలపై అంచనాకు వచ్చిన టిఆర్ఎస్ …సోషల్ ఇంజనీరింగ్ పై నజర్ పెట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత టిఆర్ఎస్ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం హుజురాబాద్లో గెలుపు తమదేనని టీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలేరు, నారాయణ ఖేడ్, హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరిగాయ్. దుబ్బాక మినహా అన్ని చోట్ల గులాబీ పార్టీనే విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో తమకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని …హుజురాబాద్లోనూ తమదే గెలుపంటున్నారు నేతలు. ఈ ఫలితాల పై బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
Also Read
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
పోలింగ్ సరళి తమకు అనుకూలంగా ఉందని కమలనాథులు విశ్వాస్వం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు సైతం తమకే అనుకూలంగా ఉన్నాయంటున్నారు. అధికార trs పార్టీ… ఈ ఎన్నికలో గెలవడానికి ఎన్ని విధాలుగ ప్రయత్నించాలో అన్ని విధాలుగా ట్రై చేసిందని… అయినe ప్రజలు తమ వైపే నిలిచారని ఆ పార్టీ నేతలు అంటున్నారు… 30 వేలకు పైగా మెజారిటీ ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ.. డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నించాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజల హృదయాల్లో కాంగ్రెస్ నిలిచే ఉందని చెబుతోంది. ప్రధానంగా ఇరుపార్టీల మీద ప్రజల్లో ఉన్న భ్రమలు తొలగిపోతున్నాయని.. భవిష్యత్ కాంగ్రెస్దే అంటున్నారు ఆపార్టీ నేతలు.
తాజావార్తలు
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే… వైద్యుల హెచ్చరిక
-
Whats App: మెటా సంచలనం.. సరికొత్త ఫీచర్లతో ‘వాట్సాప్ ప్లస్’ విడుదల.. సబ్స్క్రిప్షన్ రూ.79..
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!