Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. ఇన్నాళ్ళు రకరకాలుగా ఎదురు చూసీ…చూసీ….ఇక ఫైనల్గా త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ మీదే హోప్స్ పెట్టుకున్నారు. తెలంగాణ మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. మొదటిసారి విస్తరణ సమయంలో తర్వాత ఇస్తామని అధిష్టానం చెప్పినట్టు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకున్నారు. కానీ రెండో విడత జరిగిన మంత్రివర్గ విస్తరణలో సైతం రంగారెడ్డి జిల్లాకు స్థానం…
తెలంగాణ ప్రభుత్వం తాజాగా విప్లను నియమించింది. వాటి విషయంలో ఇప్పుడు పార్టీ పరమైన రచ్చ మొదలైంది. ఆశావహులు భారీగా ఉండటం, నిరాశ పడటం సహజ పరిణామమే అయినా… ఇప్పుడో కొత్త వాదన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పదవుల పంపకాల్లో అంతా కొత్తగా వచ్చిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారని, కష్టకాలంలో అండగా ఉండి జెండా మోసిన వాళ్ళకు మొండి చేయి చూపిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. నమ్ముకుని ఉన్న వాళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా అని కూడా…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు లేని పేదల కోసం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో మొదటి దశ కింద ఇప్పటికే 3.60 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో కనీసం లక్ష యూనిట్లను ఈ నెల 31వ తేదీలోపు పూర్తి చేసి.. లబ్ధిదారులతో…
Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన చేసిన తరహాలో రాష్ట్రంలోని ప్రతి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందు కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన కొరకు ఒక్కొక్కటి సుమారు రూ.17.50 లక్షల వ్యయంతో మొత్తం రూ.5 కోట్ల 80 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది.. తెలంగాణ తల్లి విగ్రహం ఎత్తు 12…
KTR : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న ఘటనలు తెలుగు ప్రజలకు తలవంచుకునే పరిస్థితి తెచ్చాయని ఆయన విమర్శించారు. కేటీఆర్ మాట్లాడుతూ, “ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మచ్చలాంటివి. ఐఏఎస్ అధికారులను బలి పశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది,”…
Liquor Shop Applications: నేడు మద్యం దుకాణాల దరఖాస్తులకు చివరి రోజు. నిన్న ఒక్కరోజే 25వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 50 వేల దరఖాస్తులు వచ్చాయి. నేటితో మద్యం దుకాణాల దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ తెలిపింది. అక్టోబర్ 23వ తేదీన కొత్త దుకాణాల కేటాయింపునకు సంబంధించి డ్రా ప్రక్రియ నిర్వహిస్తారు.
డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది.…