Karimnagar: కరీంనగర్ RBL బ్యాంకులో 138 కోట్ల మోసం బట్టబయలు.. వెలుగులోకి కీలక విషయాలు..
- మ్యూల్ అకౌంట్లతో భారీ సైబర్ మోసం
- బ్యాంకు మేనేజర్, క్యాషియర్ పాత్ర బయటపాటు
- 2,000 మంది నెట్వర్క్తో దేశవ్యాప్త స్కాం
- విదేశాలకు మళ్లిన నిధులపై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న ఒక భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్వర్క్ను కరీంనగర్ పోలీసులు చేధించారు. స్థానిక ఆర్బిఎల్ (RBL) బ్యాంకును వేదికగా చేసుకుని సుమారు 139 కోట్ల రూపాయల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’లో భాగంగా సాగించిన ఈ విచారణలో మ్యూల్ అకౌంట్ల (Mule Accounts) ద్వారా సాగుతున్న ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటివరకు బ్యాంకు సిబ్బందితో సహా మొత్తం 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మోసంలో విస్తుపోయే నిజం ఏమిటంటే, సాక్షాత్తు బ్యాంకు మేనేజర్ , క్యాషియర్ నేరగాళ్లతో చేతులు కలిపారు. సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాల్లో బాధితుల నుండి కొట్టేసిన సొమ్మును ఈ బ్యాంకులోని కరెంట్ అకౌంట్లలోకి మళ్లించేవారు. నిందితులకు సహకరించినందుకు గాను బ్యాంకు సిబ్బంది భారీగా లబ్ధి పొందినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులు సుమారు 2,000 మందితో ఒక పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసి, కమిషన్ల ఆశ చూపి సామాన్య ప్రజల పేరుతో ఖాతాలను తెరిపించారు. ప్రతి లక్ష రూపాయల లావాదేవీకి అకౌంట్ హోల్డర్కు రూ. 2,000 (2%) కమిషన్ ఇస్తూ, వారి ఖాతాలను కేవలం ఒక ముసుగులా వాడుకున్నారు.
Also Read
- Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
- Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
- Colleges Closed: బిగ్షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
- Negligence : జహీరాబాద్ ఆస్పత్రిలో విషాదం.. వైద్యులు లేక శిశువు మృతి
Ayodhya: అయోధ్య యజ్ఞశాలలో భారీ అగ్నిప్రమాదం.. ఎకరం విస్తీర్ణం దగ్ధం
బ్యాంకులోని కరెంట్ అకౌంట్ల ద్వారా జరిగిన ఈ వందల కోట్ల లావాదేవీలు పోలీసులకు అనుమానం కలిగించాయి. ఖాతాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాల సొమ్ము ఇక్కడికే చేరుతున్నట్లు నిర్ధారణ అయింది. ఈ అక్రమ సొమ్ము కేవలం దేశానికే పరిమితం కాకుండా చైనా , దుబాయ్ వంటి దేశాలకు కూడా మళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆర్బిఎల్ బ్యాంకుతో పాటు నగరంలోని మరో రెండు మూడు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
ప్రస్తుతం అరెస్ట్ అయిన 13 మంది నిందితులను విచారిస్తున్న పోలీసులు, ఈ చైన్ నెట్వర్క్లో ఉన్న మరికొంత మంది కీలక వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతాలను ఇతరులకు వాడటానికి ఇచ్చి అనవసరమైన చిక్కుల్లో పడకూడదని, తక్కువ శ్రమతో వచ్చే అదనపు ఆదాయం వెనుక పెద్ద మోసాలు ఉండవచ్చని కరీంనగర్ పోలీస్ యంత్రాంగం హెచ్చరిస్తోంది. ‘ఆపరేషన్ క్రాక్ డౌన్’ ద్వారా ఈ నెట్వర్క్ మూలాలను పూర్తిగా చేధిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Fire Accident: నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం
-
Lenin: ‘వస్తున్నాం… మనోడు కొడుతున్నాడు’.. అఖిల్ సినిమాపై నాగార్జున బ్లాక్బస్టర్ హుకుం!
-
Mumbai Heavy Rains: దంచికొట్టిన వాన.. 24 గంటల్లో 265 మిల్లీమీటర్ల వర్షం.. నేడు స్కూల్స్ కు సెలవు..!
-
Astrology: జూలై 6 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!