Double Murder : హత్య చేసింది ఎవరు..? మిస్టరీని తలపిస్తున్న జంట హత్యలు..
- హత్య చేసింది ఎవరు?
- హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది?
- దోపిడీ దొంగల పనా?
- ఆస్తి తగాదాలు ఏమీ లేవంటున్న కుటుంబ సభ్యులు
- మిస్టరీని తలపిస్తున్న జంట హత్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Murder : జనగామ జిల్లాలో దారుణం జరిగింది. తల్లీకూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. 80 ఏళ్ల వృద్ధురాలు అని కూడా చూడకుండా చంపేశారు దుండగులు. ప్రస్తుతం తల్లీ కూతుళ్ల హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జనగాం జిల్లా జాఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లిలో గాలి రాణి.. తన తల్లి తుమ్మ అన్నమ్మతో కలిసి ఉంటోంది. అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఐతే ఈ తల్లీ కూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. 80 ఏళ్ల వృద్ధురాలిని దుండగులు ఇంట్లోనే చంపేశారు. ఆ తర్వాత ఆమె కూతురు రాణిని ఆరుబయట హత్య చేసి పారిపోయారు..
ZPTC By Elections: కడప జిల్లా జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ట్విస్టుల మీద ట్విస్టులు..!
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
జనగాం జిల్లా జాఫర్ ఘడ్ మండలం తమ్మడపల్లిలో ఉంటున్నరాణి.. భర్త జాజిరెడ్డి మృతి తర్వాత 80 ఏళ్ల తల్లితో కలిసి నివాసం ఉంటుంది. రాణి కూతురు కవితకు పెళ్లయింది. ఆమె విజయవాడ దగ్గర ఉంటోంది. ఇక రాణి ఇంట్లో పని చేసేందుకు పనిమనిషి వచ్చి తలుపు తెరవగానే అన్నమ్మ రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పనిమనిషి జెన్నిక.. విషయాన్ని స్థానికులకు తెలిపింది. అదే సమయంలో ఇంటి ఆరుబయట రాణి తలపై బలంగా కొట్టి ఆమెపై బెడ్ షీట్ కప్పి ఉంచారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జంట హత్యలపై పోలీసులకు సమాచారం ఇచ్చారు…
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్స్ స్క్వాడ్తో పరిసర ప్రాంతాలని పరిశీలించారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. రాణి కూతురు కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు… ప్రశాంతంగా ఉండే పల్లెలో తల్లీ కూతుళ్ల జంట హత్యలు కలకలం రేపాయి. ఎవరితో ఎలాంటి విభేదాలు లేని 80 ఏళ్ల వృద్ధురాలు, 60 ఏళ్ల పైబడిన మహిళను హత్య చేసింది ఎవరు? హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? దోపిడి దొంగల పని అనుకుందామన్నా వారి బంగారం వారి దగ్గరే ఉంది. ఆస్తుల తగదాలు ఏమీ లేవంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో ఈ జంట హత్యలు మిస్టరీని తలపిస్తున్నాయి.
AP Liquor Scam Case: జగన్ ఎప్పుడైనా అరెస్ట్ కావొచ్చు..! డేట్ చెప్పలేం..
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!