Hyderabad: భార్యపై అనుమానంతో.. అందరూ చూస్తుండగానే నరికి చంపిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Wife : ఇప్పుడు దేశం మొత్తం ఒకటే ట్రెండ్ నడుస్తోంది. భర్తలను చంపడమే పనిగా పెట్టుకున్నారు భార్యలు.. అంతేకాదు పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తలను తీసుకెళ్లి చంపేస్తున్నారు. ప్రియుడి మోజులో పడి భర్తలను ట్రాప్ చేసి మరీ కడతేర్చుతున్నారు. అయితే ట్రెండ్కు భిన్నంగా హైదరాబాద్లో ఒక ఘటన జరిగింది. మరో వ్యక్తితో సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను చంపేశాడు భర్త. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్లో జరిగింది. ఓ వైపు మేనకోడలు కూతురు పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగానే.. భార్యను అందరి ముందే కర్కశంగా నరికి చంపేశాడు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది..
READ MORE: PM Modi: అప్రూవల్ రేటింగ్స్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నరేంద్ర మోడీ..
Also Read
- Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
- Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
- Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ సమ్మక్క దంపతులు. సమ్మక్క అక్క కళావతితో శ్రీనివాస్కు గతంలో వివాహమైంది. శ్రీనివాస్పాత ఇనుప సామాన్ల వ్యాపారం చేస్తున్నాడు. వీరికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. కళావతి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు మాట్లాడుకుని శ్రీనివాస్కు సమ్మక్కను ఇచ్చి రెండో వివాహం చేశారు. ఐతే వీరికి కూడా ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి దాంపత్య జీవితంలో అనుమానం చిచ్చు పెట్టింది. సమ్మక్కపై శ్రీనివాస్కు అనుమానం పెరిగింది. మరో వ్యక్తితో భార్య సమ్మక్క చనువుగా ఉంటున్నట్లు గుర్తించి… నిత్యం గొడవ పడేవాడు. ఇలా కొన్ని రోజుల క్రితం చాలా గొడవలు జరిగాయి. ఇదే విషయం పై గత 15 రోజుల క్రితం సూర్యాపేటలో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. ఆ తర్వాత సమ్మక్క హైదరాబాద్ వచ్చి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ఉంటోంది. శ్రీనివాస్ మేనకోడలయిన రాజేశ్వరి కూడా సమ్మక్క ఉండే బీసీ కాలనీలో నివాసముంటోంది.
READ MORE: Off The Record: సిల్లీ విషయంలో సీరియస్ గా తలబడ్డ ఇద్దరు పెద్ద నాయకులు?
రాజేశ్వరి కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా సమ్మక్కను వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజుకు ఇంటికి పిలిచారు. అందులో భాగంగా శ్రీనివాస్, సమ్మక్క కూడా బర్త్డేకు వచ్చారు. రాజేశ్వరి కుమార్తె కేక్ కట్ చేసే క్రమంలో సమ్మక్క.. తన ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తోంది. ఈ క్రమంలో శ్రీనివాస్ ఒక్కసారిగా సమ్మక్కపై కత్తితో దాడి చేసి గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడ్డ సమ్మక్క అక్కడే మృతి చెందింది. అనంతరం శ్రీనివాస్ అక్కడ నుండి సూర్యాపేటకు పారిపోయాడు. ఈ ఘటనతో స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే అబ్దుల్లాపూర్మెట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమ్మక్క హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. భర్త శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
-
India vs Sri Lanka Test: 10 వికెట్ల సుతార్, సారాంశ్ జైన్ రాక.. కొలంబో టెస్ట్ తుది 11పై ఉత్కంఠ
-
Shavukaru Janaki : వెండితెర ‘షావుకారు’ జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!