Bhongir MP Komatireddy Venkat Reddy about Telangana Congress తెలంగాణ కాంగ్రెస్ ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. అయితే టీకాంగ్రెస్ పోరు ఇప్పుడు బయట పడడంతో హాట్టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న కొట్లాటలుంటాయని, అన్నీ సర్దుకుంటాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ మారే ప్రసక్తి లేదని, నేను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. కుటుంబంలో భిన్నాభిప్రాయాలు…
తెలంగాణ కాంగ్రెస్లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు.…
తెలంగాణ రాజకీయం హస్తినలో చేరింది. ఢిల్లీలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ల్యాండ్ అయ్యారు. అయితే అందరూ కలిసిమెలసి ఢిల్లీకి వెళ్లారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఢిల్లీకి వెళ్లేందుకు ఒక్కొక్కరి ఒక్కో ప్రాబ్లెం.. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తెలంగాణ కాంగ్రెస్కు తలనొప్పిగా మారిన జగ్గారెడ్డి ఎపిసోడ్, తదితర అంశాల గురించి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇచాంర్జీ మాణిక్కం ఠాగూర్తో మాట్లాడేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లారు. అధిష్టానం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్…
పోయినవాళ్లు పోగా.. ఉన్నవారిలో ఆయన ఒక్కరే స్వపక్షంలో విపక్షం అనుకున్నారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యేదీ అదేదారి. ఒకరికి ఇద్దరయ్యారు. సేమ్ టు సేమ్. వారి గురించే పార్టీలో ప్రస్తుతం చర్చ. వారెవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్లోనే ఉంటాననే నమ్మకం కలిగించడం లేదు..!తెలంగాణ కాంగ్రెస్ తీరు మారదా? మంచిరోజులు కనుచూపు మేరలో లేవా? పార్టీలో పరిస్థితి ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? హస్తం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరా? గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్నలివి. కొన్నిరోజులు ఒకరు.. మరికొన్ని రోజులు…
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయనకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, జగ్గారెడ్డిని కేసీయార్ పక్కన పెట్టి టీఆర్ఎస్ కండువాలు కప్పి పోస్ట్ చేయడంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీహెచ్-సీఐ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జగ్గారెడ్డి కి బుజ్జగింపులు పర్వం మొదలైంది. పార్టీలో తనని కోవర్ట్ అంటున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి…
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంపై హైదరాబాద్లో కేసు నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మహిళలను అవమానించేలా మాట్లాడిన హేమంతపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రేవంత్ సోమవారం పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. 48గంటల పాటు చూస్తామని.. అప్పటి వరకు కేసులు పెట్టకపోతే పోలీస్ స్టేషన్ లు ముట్టడిస్తామన్నారు.…
తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భిన్న ధృవాలుగా వున్నారనే ప్రచారం వుంది. తాజాగా వీళ్ళిద్దరూ ఐక్యతారాగం వినిపించారు. కలిసి కనిపించారు. తెలంగాణలో పీసీసీ పీఠం కోసం ఇద్దరూ పోటీ పడ్డారు. ఒకరికి పదవి దక్కగానే.. మరొకరు ఒంటికాలిపై లేచారు. ఇప్పటికీ ఇద్దరి మధ్య సమన్వయం లేదు. కానీ అప్పుడప్పుడు కలిసి కనిపిస్తారు. మనసులు కలిశాయా.. మనుషులు కలిశారా అని అనుకుంటున్న తరుణంలోనే చర్చల్లోకి వస్తారు. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ పడుతున్న…
నల్లగొండలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా సాగుతోంది. అయితే మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమావేశంలో కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. ఫ్లెక్సీపై మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి ఎల్ అర్ ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు అభ్యంతరం తెలిపారు. దీంతో సీనియర్ నేత జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడారు. మిర్యాలగూడ నుండే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను కాపాడాలి. రాష్టంలో కాంగ్రెస్ ప్రతిష్టను…
ఈ నెల 17వ తేదీన హైదరాబాద్లోని ప్రగతి భవన్ వద్ద సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష బదులు ఉమ్మడి పోరాటం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. శనివారం నాడు జరిగిన జూమ్ మీటింగ్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యక్రమాల ఛైర్మన్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.…
తెలంగాణలో ఆ రెండు పార్టీల పంచాయితీలో కాంగ్రెస్ సైడ్ అయిపోయిందా..? రాజకీయ చదరంగంలో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నది ఎవరు..? ఆ రెండు పార్టీల వ్యూహంలో కాంగ్రెస్ పాత్ర ఏంటి? బీజేపీ, టీఆర్ఎస్ల మధ్యే విమర్శలు.. కాంగ్రెస్ మౌనం..!తెలంగాణ రాజకీయాలు ఒకింత ఆశ్చర్యంగా.. మరికొంత వ్యూహాత్మకంగా నడుస్తున్నాయి. గడిచిన రెండు నెలలుగా పొలిటికల్ వార్ బీజేపీ.. టీఆర్ఎస్ మధ్యే సాగుతోంది. ధాన్యం కొనుగోళ్లు మొదలుకుని.. ఉద్యోగుల కేటాయింపు వరకు ఈ రెండు పార్టీల మధ్య గట్టిఫైటే జరుగుతోంది. ఈ…