పిలుపులు, అలకలు ఆ పార్టీలో రొటీన్ అయిపోయాయా.? కారణం ఎవరు.? l
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కాంగ్రెస్లో కొందరు సీనియర్ నాయకులతో AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఇటీవల హైదరాబాద్లోని MLA క్వార్టర్స్లో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి కేవలం 9 మంది నేతలనే పిలిచారు ఠాగూర్. వీరితోపాటు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కూడా హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఉత్తమ్ కుమార్రెడ్డి.. దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీటింగ్కు వెళ్లారు. సాధారణంగా సమావేశం సీనియర్ నేతలకే పరిమితమైతే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ వ్యూహకర్త రావడంతో ఆహ్వానాలు అందని నాయకులు చాలా ఫీలయ్యారట.
పార్టీ పదవులలో ఉన్న నాయకుల్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్.. AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్రెడ్డి వంటి వారికి ఆహ్వానాలు లేవు. దీంతో గీతారెడ్డి.. మహేశ్వర్రెడ్డి లాంటి నాయకులు ఇంఛార్జ్ ఠాగూర్పై గుర్రుగా ఉన్నారట. పైగా ఆ మీటింగ్కు వెళ్లినవారిలో పార్టీపై అసంతృప్తితో ఉన్నవాళ్లు.. పార్టీ లైన్కు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లూ ఉన్నారు. తాము కూడా అలాగే ఉంటే మీటింగ్కు పిలిచేవాళ్లేమో అనే చర్చ మొదలైందట. ఈ పరిణామాలపై కాంగ్రెస్లో కీలక పదవిలో ఉన్న నాయకుడు దగ్గర వాపోయారట సీనియర్ నేతలు. AICC ఇంఛార్జే కాంగ్రెస్ సీనియర్లను విస్మరించి సమావేశం ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట. పీసీసీలో తాజా, మాజీ చీఫ్లతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్.. AICC కార్యక్రమాల అమలు కమిటీ కూడీ కీలకమే కదా అని ప్రశ్నిస్తున్నారట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీటింగ్ అంతా రహస్యంగానే సాగింది. ఆ భేటీకి సంబంధించి ఫొటోలు.. వీడియోలు తీయడానికి కూడా అంగీకరించలేదు. పూర్తి ఆంక్షల నడుమ.. ఎవరూ దరిదాపులకు రాకుండా సమావేశం సాగిపోయింది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీనే పిలిచి సమావేశానికి సంబంధించిన వీజువల్స్.. ఫొటోలు ఇస్తుంది. ఆ సంప్రదాయానికి భిన్నంగా సాగింది లేటెస్ట్ మీటింగ్. పైగా కొందరినే పిలవడం ఇప్పుడు రచ్చ అవుతోంది. త్వరలో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఉంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతోపాటు… తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి చకచకా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నిర్వహిస్తున్న సమావేశాలు కొందరి చుట్టూనే తిరగడం.. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో గుర్రుగా ఉన్నారు సీనియర్లు.
తాజావార్తలు
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
-
Allu Arjun : పుష్ప 3 పక్కన పెట్టి ఆ నలుగురు డైరెక్టర్లతో బన్నీ భారీ స్కెచ్
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!