తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఉదయం 6 గంటలకి కుటుంబ సమేతంగా సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన సతీమణితో పాటు కూతురు అల్లుడు మనవరాళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా రూ.251 కోట్లతో మేడారంలో అభివృద్ధి చేసిన గుడి ప్రాంగణాన్ని ప్రారంభించి భక్తులకు అంకితం ఇవ్వనున్నారు. మేడారంలో అభివృద్ధి చేసిన జంక్షన్ లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 7:45 నిమిషాలకి హెలికాప్టర్ లో శంషాబాద్ ఎయిర్…
Cabinet Meeting: ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం, అధికారులు మేడారం రానున్నారు. వన దేవతల సన్నిధిలో మంత్రివర్గ భేటీ కానుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4:30 ని.లకు ముఖ్యమంత్రి, మంత్రులు మేడారం చేరుకోనున్నారు. 5 గంటలకు మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసి ఆచారసాంప్రదాయాల ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలుకుతారు. 5PM టూ 6:30PM వరకు హరిత హోటల్ ప్రాంగణంలో మంత్రివర్గం భేటీ కానుంది.