హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లోని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఆఫీస్ & ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. హీరా గ్రూప్ కార్యాలయం నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగి పోయారు. కోట్లకు పైగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు ఈడీ గుర్తించింది.
Off The Record: సినీ సెలబ్రెటీలతో పొలిటికల్ లీడర్స్కు స్నేహమో.. బంధుత్వమో ఉండటం సహజం. ఆ విషయం ముందుగానే జనానికి తెలిస్తే అందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఏదేనీ ఫంక్షన్కు లీడర్స్ వస్తే వచ్చారని అనుకుంటారు.. రాకపోతే ఎందుకు రాలేదు అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఆరా తీస్తారు. అదే.. హీరోలకు.. పొలిటికల్ లీడర్స్కు ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి లీకులు లేకుండా.. ఒకే ఫ్రేమ్లో పదే పదే తళుక్కుమంటే చర్చగా మారడం ఖాయం. హీరో…
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసిన తెలంగాణ సీఎం, గులాబా పార్టీ బాస్ కేసీఆర్.. ఏపీలోనూ పార్టీ విస్తరణకు చర్యలు చేపట్టారు.. అయితే, సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు.. ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు? అని ప్రశ్నించారు జీవీఎల్.. బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.. ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్కు ఇక్కడ పనేంటి? అని నిలదీశారు. ఇక, తెలంగాణలోనూ…
అక్కడ ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారా? డాక్యుమెంట్ కదలాలంటే కాసులు ముట్టజెప్పాల్సిందేనా? కొర్రీలు పెట్టి మరీ డబ్బులు దండుకున్నది ఎవరు? ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇన్ఛార్జ్ ల పాలన ఇంకెన్నాళ్ళు. డాక్యుమెంట్ రైటర్లు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు? వివిధ పార్టీల నాయకులు వారికే ఎందుకు మద్దతు తెలుపుతున్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇన్ ఛార్జి సబ్ రిజిస్ట్రార్ల తీరు విమర్శల పాలవుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఇంచార్జ్ ల…
మత్తుమందులకు వున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఒకసారి దానికి అలవాటు పడితే అది యువతను వదలదు. ఈమధ్యకాలంలో యువత మత్తుకి బానిసలై తమ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో గల్లీకో ముఠా తయారై డ్రగ్స్ అమ్మేస్తోంది. జూబ్లీహిల్స్ పరిధిలో డ్రగ్స్ తయారు చేసి, విక్రయిస్తూ పట్టుబడ్డాడు శ్రీరామ్ అనే యువకుడు. ఇంటినే ల్యాబ్ లా మార్చాడా యువకుడు. సూర్యాపేట జిల్లా కు చెందిన యువకుడు శ్రీరామ్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. చెడు వ్యసనాలకు…
తెలంగాణలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేంద్రం తీరుని ఎండగడుతున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తనదైన రీతిలో ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. యాసంగిలో తెలంగాణలో అధిక శాతం బాయిల్డ్ రైస్ ( ఉప్పుడు బియ్యం ) మాత్రమే ఉత్పత్తి అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి తెలిసినా, రా రైస్ మాత్రమే కొంటామంటూ మొండి వైఖరి ప్రదర్శిస్తోందన్నారు కవిత. రైతులు…