ఇటీవలి కాలంలో ఏపిలో టిడిపి నేత అరెస్టు,కేసు చూస్తున్న వారికి ఎంపి రఘురామకృష్ణం రాజు అరెస్టు అట్టే ఆశ్చర్యం కలిగించదు. కాకపోతే వారు ప్రత్యర్థి పార్టీకి చెందిన వారు కాగా ఈయన పాటక వైసీపీ టికెట్ పైనే ఎంపికైన ఎంపి. కారణాలేమైనా చాలా కాలంగా ఆయన అధినేతతో విభేదించి వివాదగ్రస్తమైన వ్యాఖ్యలు కొససాగిస్తున్నారు. దీనిపై ఆయనను అనర్హుడిగా ప్రకటించాని వైసీపీ పార్లమెంటరీ పార్టీ లోక్సభ స్పీకర్ను కోరింది. అయితే తాము పార్టీ పక్షాన చర్యలు తీసుకోవడానికి మాత్రం…
అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మరోసారి దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా సమీక్ష ప్రారంభించింది. తాత్కాలిక అద్యక్షురాలు సోనియా గాంధీ ఆద్యక్షతన జరిగిన వర్కింగ్ కమిటీ వర్చువల్ సమావేశం మొక్కుబడిగా తప్ప లోతుగా పరిశీలన జరిపిందా అంటే లేదనే చెప్పాలి. ఈ ఎన్నికలో తమ పార్టీకి వచ్చిన పలితాలు చాలా నిరుత్సాహకరంగా వున్నాయని సోనియాగాంధీ వ్యాఖ్యానించడం మినహా మరే విధమైన ఆత్మ విమర్శ కనిపించలేదు. కేరళలో అస్సాంలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ కోరుకున్నది. పశ్చిమ బెంగాల్లో వామపక్షంతో…
పంచతంత్రంలో పారని మోడీ తంత్రం అని ఎన్టివితొగులో చెప్పుకున్నదాన్ని ఎగ్జిట్పోల్స్ ఫలితాలు ధృవపరుస్తున్నాయి.వారు పాలిస్తున్న అసోం మినహా తక్కిన మూడు ప్రధాన రాష్ట్రాలోనూ బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని ఎక్కువ సంస్థల ఎగ్జిట్ పోల్స్చెబుతున్నాయి. హోరాహోరీగా జరిగిన పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలో బిజెపి అధికారంలోకి రాకపోవచ్చని అత్యధిక పోల్స్ సూచిస్తున్నాయి. గతంలోని 211 స్థానాల నుంచి 150కి అటూ ఇటూగా తగ్గినా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ రావచ్చుననే చెబుతున్నాయి. రిపబ్లిక్ టీవీ పోల్స్లో బిజెపి…