ఆర్ఆర్ఆర్ అనబడే రౌద్రం రుధిరం రణం చిత్రంలోని దోస్తీ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి నిర్దేశంలో గాయకుడు హేమచంద్ర పాడిన సీతారామశాస్త్రి పాట చిత్రంలో చిత్రణ అలా వుంచితే విడుదలచేసిన ట్రైలర్లో కూడా ఉద్వేగభరితంగా వుంది. గిరిజనులను కదిలించి పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ల మధ్య వూహాజనిత స్నేహం దాని పరిణామం చిత్రకథ గనక స్నేహగీతం విడుదల చేయడం కూడా సముచితమే. పులికి విలుకానికి,తలకూ వురితాడుకూ కదిలే కార్చిచ్చుకు కసిరే…
పెగాసస్ స్పైవైర్పై పోరాటం అంతకంతకూ తీవ్ర రూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి.లోక్సభ రాజ్యసభ రెండుచోట్లా తమ వాయిదా తీర్మానాలను నోటీసులను తోసిపుచ్చడం ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పైగా తమ ఒత్తిడిని బేఖాతరు చేయడమే గాక ఇదే అదనుగా కీలకమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడం వాటికి మరింత అసహనం కలిగిస్తున్నది. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలను నిబంధనలను పాతర వేయడమేనని సభ్యులు విమర్శిస్తున్నారు.ఈ రోజు కూడా లోక్సభలో కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారి, రాజ్యసభలో సిపిఎం సభ్యుడు ఎలగారం కరీం…
పార్లమెంటు సమావేశాలకు ఒక రోజు ముందు పెగాసస్ స్పైవేర్తో వందలమంది మొబైళ్లను అక్రమంగా ఆలకించారన్న ఘోరం బయిటకు వచ్చింది. రహస్యంగా వినడానికే గాక రహస్య చిత్రాలు తీయడానికీ ఇది ఉపకరిస్తుంది. మన దేశంలో వైర్తో సహా ప్రపంచ వ్యాపితంగా పదిహేను దేశాల మీడియా సంస్థలు ఈ కథనాన్ని సాక్ష్యాధారాలతో సహా వెల్లడి చేశాయి.ఇజ్రాయిల్కు చెందిస స్పైవేర్ తయారీదారీ సంస్థ ఎన్ఎస్వో గ్రూపుచెప్పిన ప్రకారం దాన్ని ప్రభుత్వాలకే విక్రయిస్తారు.ఈ మాట మోడీ ప్రభుత్వమూకాదనలేదు. అనధికారికంగా హ్యాకింగ్ కుదిరేపని కాదంటున్నది.…
రావిశాస్త్రిగా పేరొందిన రాచకొండ విశ్వనాథశాస్త్రి తెలుగు కథాసాహిత్యంలో, నవలా రచనలో తనకంటూ ఒక పరపడి ఏర్పాటుచేసుకున్న ప్రముఖ రచయిత. స్వతహాగా న్యాయవాది అయిన రావిశాస్త్రీ న్యాయస్థానంలోనే గాక తన జీవితంలోలోనూ పేదలకు న్యాయం కోసం కలం అంకితం చేసిన గొప్ప రచయిత.వర్గసమాజంలో ప్రత్యక్షంగానే గాక కనిపించకుండా సాగే క్రూరమైన పీడననూ, న్యాయప్రక్రియలో వర్గ వైరుధ్యాలను కళ్లకు కట్టిన ప్రజారచయిత. 1922 జులై30న విశాఖ జిల్లా తుమ్మపాలెంలో పుట్టిన రావిశాస్త్రి శతజయంతి వత్సరం మొదలవుతున్నది.1940లలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రంలో…
ఇరవైరోజుల నాటకీయ పరిణామాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా యొడ్యూరప్ప రాజీనామా చేయడం, ఆస్థానంలో బసవరాజ్ బొమ్ముయ్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. బొమ్మయ్ గతంలో జనతాదళ్ ముఖ్యమంత్రిగా ఆపార్టీ జాతీయ అద్యక్షుడుగా పనిచేసిన ఎస్ఆర్బొమ్మయ్ కుమారుడు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మయ్ని తొలగించినప్పుడు కోర్లు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. పాత చరిత్ర అలా వుంచితే బసవరాజ్ యొడ్యూరప్ప మంత్రివర్గంలో హోంశాఖ నిర్వహించారు. ఆయనకు విశ్వాసపాత్రుడు.అంతేగాక యెడ్యూరప్పలాగే లింగాయత్ వర్గానికి చెందిన వారు. ఆయన సలహామేరకే బసవరాజ్…
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శరద్పవార్తో,గాంధీ కుటుంబంతో జరుపుతున్న మంతనాలు,ప్రతిపక్ష నేతల సమావేశం,రేపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢల్లీి పర్యటన వంటి అంశాలు ఇప్పుడుమీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీకి బిజెపి ఎన్డిఎ కూటమికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారనేది ఒక అభిప్రాయం. అందుకు సంబంధించిన సంప్రదింపులలో కాంగ్రెస్ మొదట పాల్గొనకపోవడంపై వ్యాఖ్యలు వచ్చాక ఆయన నేరుగా సోనియా రాహుల్ తదితరులతో చర్చలు జరిపివచ్చారు. ఇప్పుడు మమతా…
మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్మ్యాన్ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం ఇందుకు కారణమవుతున్నది. తర్వాత ఆయన మీడియాతోనూ మాట్లాడారు. ఆయన చెప్పిన పేర్లలో ప్రధానంగా వినిపిస్తున్న ఎర్రగంగిరెడ్డి తనకు హత్యతో సంబంధం లేదని అంటుండగా మరోపేరు సునీల్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. శుక్రవారం నాడు ఈ హడావుడి మొదలవడానికి ముందు హత్యకేసు దర్యాప్తు…
కోవిడ్ మూడోవేవ్ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది, ఎందుకంటే మరణాల సంఖ్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలదే తప్పుఅన్నట్టు కేంద్రం మాట్లాడుతున్నది.దేశంలో నమోదైన కోవిడ్ మరణాలసంఖ్యకు వాస్తవంగా సంభవించిన వాటికి చాలా తేడావున్నట్టు అంతర్జాతీయంగానూదేశంలోనూ కూడా కథనాలు వచ్చాయి. ప్రధాని మోడికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన అరవింద్ సుబ్రహ్మణ్యం బృందంనుంచి…
మాజీ మంత్రిఈటెల రాజేందర్ బిజెపిలో చేరిక తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజేందర్పై సానుభూతి టిఆర్ఎస్ అధికార బలం మధ్యనే పోటీ అనుకున్నది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతున్నది. ఆరుమాసాల్లో ఉప ఎన్నిక జరపాలనే నిబంధన వున్నా కోవిడ్ నేపథ్యంలోఅదే సందేహంలో పడిరది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిని మార్చడం, బెంగాల్ ముఖ్యమంత్రి మమత మరోచోట పోటీ చేసి గెలిచే అవకాశంపైనా అనుమానాలు హుజూరాబాద్నూ సందేహంలో నెట్టాయి. ఈటెల రాజేందర్పై సానుభూతి ప్రధానంగా పోటీ జరుగుతుందన్న…
వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. గాంధీ తిలక్ వంటి జాతీయ నాయకులను శిక్షించేందుకు బ్రిటిష్ వారు తెచ్చిన ఈ సెక్షన్లు 75ఏళ్ల స్వాతంత్రం తర్వాతా దేనికని సిజె రమణ మాజీ మేజర్ జనరల్ వోంబట్కరే దాని రద్దుకోసం దాఖలు చేసిన కేసు సందర్భంగా ప్రశ్నించారు. 1890నాటి రాజద్రోహచట్టం, 1910లో బ్రిటిష్పత్రికా చట్టం 1917లో రౌలట్ చట్టం,1928 ప్రజాభద్రతా చట్టం…