Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Telakapalli Ravi Analysis On Water Dispute 3

తెలకపల్లి రవి : కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి నోటిఫికేషన్‌ లాభనష్టాల మధనం

Published Date :July 17, 2021 , 8:52 pm
By Lakshmi Narayana
తెలకపల్లి రవి :  కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి నోటిఫికేషన్‌ లాభనష్టాల మధనం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్‌ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్‌నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ఆహ్వానించారు. వాస్తవంలో ఈ విధమైన నోటిఫికేషన్‌ విడుదల చేయాలని జగన్‌ గతంలోనే కేంద్రాన్ని కోరారు.

నోటిఫికేషన్‌లోని కొన్ని అంశాల పట్ల ఎపికి కూడా అభ్యంతరాలున్నాయి కాని మొత్తం మీద ఇది తమకు అనుకూలమైన పరిణామంగా ఆ ప్రభుత్వం పరిగణిస్తున్నది. నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్యామలరావు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మేరకు ప్రకటనలు కూడాచేశారు. అయితే రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కూడా అధికారికంగా సమగ్రంగా స్పందించేందుకు ఇంకా సిద్ధం కాకపోవడం సమస్య తీవ్రతను తెలుపుతుంది. ఈ నోటిఫికేషన్‌తో మొత్తం ప్రాజెక్టులు కేంద్రం అధీనంలోకి పోవడం లాభమా నష్టమా అని తేల్చుకోలేకపోవడం ఇందుకు కారణం.

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

read also : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై షర్మిల క్లారిటీ

తెలంగాణలో బిజెపి కాంగ్రెస్‌లు ఎపిలో టిడిపి మామూలు భాషలో దీన్ని తమ ప్రభుత్వాల వైపల్యంగా చెప్పినా వారికి కూడా స్పష్టత వుందని చెప్పలేము, ఉమ్మడిరాష్ట్రనీటిపారుదల మంత్రిగా దీర్ఘకాలం పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మాత్రం దీనివల్ల మొత్తం ప్రాజెక్టుల వ్యవస్థ కేంద్రం పెత్తనం కిందకు పోతుందని వ్యాఖ్యానించారు.మరింత అధ్యయనం చేశాక స్పందిస్తానంటూనే ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌ ప్రభుత్వ చేతగానితనం వల్లనే ఇలా జరిగిందన్నారు.
వాస్తవానికి గత ఏడాది అక్టోబర్‌లో ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ పాల్గొన్న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలోనే కెఆర్‌ఎంబి పరిధిని నోటిఫై చేయాలని భావించారు.అయితే తెలంగాణ ప్రభుత్వం బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ చేసిన కృష్నా జలాల పంపిణీని సవాలు చేస్తూ కొత్త ట్రిబ్యునల్‌ వేయాలని కోరింది. దీనిపై అప్పటికే ఆ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది,

కొంత వ్యవధి తర్వాత తెలంగాణ తన కేసు ఉపసంహరించుకుంది, ఇంతలో ఎపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను టెండర్లను ఆహ్వానించడం,రాజోలిబండ డైవర్షన్‌ స్కీం కుడికాలువ నిర్మాణం చేపట్టడం పట్ల తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెల్పింది, వాటికి అనుమతి లేదని కెసిఆర్‌ వాదిస్తే అసలు తెలంగాణ కట్టే డిరడి,పాలుమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో సహా అత్యధిక ప్రాజెక్టులకు అనుమతి లేదని ఎపి ప్రతివిమర్శ చేసింది.ఇద్దరికీ కెఆర్‌ఎంబి నోటీసులు ఇచ్చింది. దీనికి తోడు శ్రీశైలంలో నీళ్లు లేకున్నా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసి నీటిని కిందకు వదలడం వల్ల తాము నష్టపోతున్నామని ఎపి ఫిర్యాదు చేసింది. కేంద్రం నుంచి కదలిక లేదని సుప్రీంలో కేసు వేసింది. దీనిపై టిఆర్‌ఎస్‌ మంత్రులు తీవ్రంగా మాట్లాడటం ఉద్రిక్తత పెంచింది. తాము సంయమనం చూపిస్తున్నామంటూ ఎపి ముఖ్యమంత్రి జగన్‌ దీనిపై ప్రధానికి లేఖ రాశారు.

ఈ వివాదం బూటకమని రాజకీయ ప్రయోజనం కోసమే ఇరు రాష్ట్రాలు కావాలని సృష్లించాయని టిడిపి కాంగ్రెస్‌ బిజెపి వంటిపార్టీలు విమర్శించాయి. ఇలాటి పరిస్థితులలో కేంద్రం నోటిఫికేషన్‌ వెలువడిరది.దీనిపై ఇంకా పూర్తి స్పష్టత వచ్చిందని చెప్పడం కష్టం.కాని ఇరువురు ముఖ్యమంత్రులు కలిసికూచుని చర్చించుకోవడం బదులు కేంద్రం అధీనంలోకి పోవడం జరిగిపోయింది.వాటాల పంపిణీ,నీటి విడుదల వంటి సమస్యలు అంతరాష్ట్ర వివాదాలై పోయాయి.ఎపి విభజనచట్టం సెక్షన్‌85(1), అంతరాష్ట్ర నదీజలాల వివాద చట్టం సెక్షన్‌87(1) రెండిరటినీ ఈ నోటిఫికేషన్‌లో ఉపయోంచారు. ఇరురాష్ట్రాలలోని ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి జిఆర్‌ఎంబి పరిదిలోకి తీసుకుని సిఐఎస్‌ఎఫ్‌ దళాల భద్రత కల్పిచండం ఇందులో ముఖ్యాంశం, అంటే రాష్ట్రాలు తమ పోలీసులను ప్రయోగించి అనుకున్నట్టు చేయడానికి అవకాశం వుండదు.

అందులోనూ మూడు రకాలుగా విభజించారు. పార్ట్‌1లో వున్నవి గతంలో అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో అంగీకారం కుదిరినవి, పార్ట్‌2లో వున్నవి వివాద గ్రస్తమైనవి. వీటిని పూర్తిగా కేంద్రం అదుపులోకి తీసుకుంది. పార్ట్‌3లో వున్నవి కూడా బిన్నబిప్రాయాలతో కూడినవి అయినా వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న తీరులోనే ఇకముందు కూడా జరుగుతుంది.అయితే అవి బోర్డుల నిర్దేశంలో పనిచేయాల్సి వుంటుంది, ఏతావాతా ఎపితెలంగాణల ప్రాజెక్టులు మొత్తం కేంద్రం గుప్పిట్లోకి వెళ్లినట్టే, సంప్రదింపుల ద్వారా పరిష్కారం కాలేదు గనకనే ఈ పనిచేయవలసి వచ్చిందని జలశక్తి శాఖ వివరించింది.ఇందులో అత్యధికంగా తమ ప్రాజెక్టులే కేంద్రం స్వాధీనం చేసుకుందిన తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెబుతున్నది.రెండు నదుల మీద కలసి107 ప్రాజెక్లులుండగా తెలంగాణకు చెందిన 79,ఎపికి చెందిన15,ఉమ్మడిగా వున్నవి13 బోర్డుల పరిధిలోకి పోతున్నాయని అంటే తమకు ఎక్కువ నష్టం కలుగుతుందని వాదిస్తున్నది.

ఈ లెక్కలతో ఏపి ఏకీభవించకపోవచ్చు.గోదావరి ప్రాజెక్టులు ఎందుకు కలపాలనికూడా ప్రశ్నిస్తున్నది, అయితే కాళేశ్వరం పోలవరం వంటివాటిపైతేడాలున్నమాట కాదనలేనిది. ఎక్కువ ప్రాజెక్టులు అనుమతిలేకుండా కడుతున్నందునే ఇలా జరిగిందనీ ఎపి నేతలు చెప్పొచ్చు,ఎపికి సంబంధించి అత్యంత పురాతనమైన ధవళేశ్వరం.ప్రకాశం బ్యారేజీతో ఇటీవలి పట్టిసీమతో సహా బోర్డుల పరిధిలోకి పోగా తెలంగాణలో కాళేశ్వరం నుంచి అన్ని నోటిఫికేషన్‌లో వున్నాయి. అయితే పైన పేర్కొన్నట్టు ఇందులో మూడు రకాలు వున్నా ఆచరణలో ఆటంకాలు వస్తాయని ఇరురాష్ట్రాలకూ సందేహాలున్నాయి. అయితే దిగువ రాష్ట్రమైన ఎపి ప్రభుత్వం ఇందులో కొంత రక్షణ వుందని స్వాగతిస్తున్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి విస్త్రతమైన చర్చ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని భావిస్తున్నారు. ఢల్లీివెళ్లిచర్చలు జరుపుతానని ఆయన చెప్పారు. రాయలసీమ నీటిపారుదల అంశాలను అనవసరంగా చేర్చారని దీనిపై కేంద్రానికి రాయాలని ఎపి ముఖ్యమంత్రిజగన్‌ చెప్పినట్టు సమాచారం.వివాద పరిష్కారం కోసం సకాలంలో చర్యలు తీసుకోకుండా ఇక్కడి దాకా తెచ్చిన కేంద్రం ఇప్పుడైనా ఎలా వ్యవహరిస్తుందో చెప్పడం కష్టమే. ఈ లోగా కోర్టుత ఆదేశాలు, ప్రభుత్వాల స్పందనలు కూడాచూడవలసి వుంటుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ పక్షాలు కూడా తాత్కాలిక రాజకీయ కోణంలో గాక దీర్ఠకాలిక ప్రయోజనాల దృష్టితో ఆలోచించి ప్రతిస్పందించడం ఇప్పుడు మరింత అవసరం, కేంద్రం కూడా తన అధికారాన్ని సామరస్య పరిష్కారం కోసం వినియోగించాలి తప్ప సమస్యను జటిలం చేసే చర్యలకు పాల్పడదని ఆశించాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh and Telangana Water Disputes
  • Andhra Pradesh vs Telangana
  • telakapalli ravi
  • telakapalli Ravi analysis
  • telangana

తాజావార్తలు

  • Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!

  • Cole Thomas Allen: సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి నాసా ఫెలో వరకు.. ట్రంప్ పార్టీలో కాల్పులకు పాల్పడిన కోల్ థామస్ అలెన్ ఎవరు?

  • Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్‌

  • Hero Splendor: సేల్స్ లో గర్జిస్తున్న స్ల్పెండర్ ప్లస్.. FY26 బెస్ట్ సెల్లింగ్ బైక్స్ టాప్ 5 లిస్ట్ ఇదే

  • Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions