Sunil Gavaskar: ఆసియా కప్లో టీమిండియా వైఫల్యానికి టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోని ఆటగాళ్లను తరుచూ మాట్లాడటం వల్లనే టీమిండియాకు ఈ గతి పట్టిందన్నాడు. 11మంది ఆటగాళ్లు తరచూ కలిసి ఆడకపోవడంతోనే ఆసియా కప్లో స్పీడ్ అందుకోలేకపోయారని.. అందుకే టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులోని ఆటగాళ్లను దక్షిణాఫ్రికా, ఆసీస్తో సిరీస్లకు ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచించాడు. ఆటగాళ్ల ఎంపికలో…
ArshDeep Singh: ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా స్వల్ప తేడాతో ఓడిపోయింది. కీలక సమయంలో టీమిండియా యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ క్యాచ్ డ్రాప్ చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. కొందరు అతడిని ఖలిస్థాన్ దేశస్థుడిగా చిత్రీకరించారు. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను అర్ష్దీప్ సింగ్ పట్టించుకోకుండా శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. తనపై వచ్చిన కామెంట్స్ను చూసి నవ్వుకున్నానని అర్ష్దీప్ సింగ్ స్వయంగా చెప్పాడు. అయితే…
Team India: ఆసియా కప్లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడి ఇంటిదారి పట్టిన టీమిండియాపై పలువురు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. అసలు టీమిండియా ఆసియాకప్కు ఎందుకు వెళ్లిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ పరమ చెత్తగా ఉందని.. అతడి నిర్ణయాలు అంతుబట్టలేని విధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఆసియా కప్ను ప్రయోగాల కోసం వాడుకుందని టీమిండియా మేనేజ్మెంట్పైనా దుమ్మెత్తి పోస్తున్నారు. టీ20 ప్రపంచకప్ మరో నెలరోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంకా టీమ్ సెట్ కాకపోవడం ఏంటని…
IND Vs SL: ఆసియా కప్లో శ్రీలంకపై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ తడబడింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ(72), సూర్యకుమార్(34) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 174 పరుగుల లక్ష్యం నిలిచింది. శ్రీలంక బౌలర్లు అద్భుతమైన యార్కర్లతో భారత బ్యాటర్లను ఔట్ చేశారు. లంక బౌలర్లలో మధుశంక 3,…
IND Vs SL: ఆసియా కప్లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగబోతోంది. శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. పాకిస్థాన్తో ఆడిన రవి బిష్ణోయ్ స్థానంలో బౌలింగ్ ఆల్రౌండర్ అశ్విన్కు స్థానం కల్పించింది. అయితే ఆశ్చర్యకరంగా దీపక్ హుడానే కొనసాగిస్తూ అక్షర్ పటేల్కు మరోసారి మొండిచేయి చూపించింది. గత…
Asia Cup 2022: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ పాకిస్థాన్ గెలుస్తుందంటూ సెహ్వాగ్ జోస్యం చెప్పడంతో పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మంగళవారం నాడు శ్రీలంకతో టీమిండియా కీలక మ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్లో భారత్ ఓడితే దాయాది పాకిస్థాన్ ఆసియా కప్ ఎగరేసుకుపోతుందని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఇటీవల టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించిన వైనాన్ని బట్టి చూస్తే దాయాది పాకిస్థాన్ ఛాంపియన్గా నిలిచే అవకాశాలు…
Team India: ఆసియా కప్లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…
Virat Kohli: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ రసవత్తరంగా సాగుతోంది. ఆదివారం నాడు సూపర్-4లో భాగంగా పాకిస్థాన్తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో టీమిండియాపై ఓడిపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ 18 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో అర్ష్దీప్ సింగ్ అసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అర్ష్దీప్ క్యాచ్ విడిచిపెట్టడంపై ప్రెస్ కాన్ఫరెన్స్లో విరాట్ కోహ్లీని అడగ్గా.. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఎంతో టెన్షన్ ఉంటుందని..…