ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్గా కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించారు. వీరితో పాటు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్గా జి. సాయి ప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా ను బదిలీ చేశారు. అంతేకాకుండా పాఠశాల…
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది. కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.…
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా మారిన డ్రైవర్ దస్తగిరి కొన్ని రోజుల క్రితం అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వివేకాను ఎలా.. ఎవరు హత్య చేశారో కూడా వాగ్మూలం ఇచ్చాడు. వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడంటూ దస్తగిరి వాగ్మూలమిచ్చినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే శివప్రసాద్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డిని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం అయ్యింది.. ఎల్లుండి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కీలక ఆర్డినెన్స్లపై ఫోకస్ పెట్టింది సర్కార్.. అసెంబ్లీ ఆమోదానికి కీలక ఆర్డినెన్సులు తీసుకురానున్నారు. ఈ ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖలకు సంబంధించి 14 ఆర్డినెన్సులను జారీ చేసింది ప్రభుత్వం.. ఒకే రోజున 14 ఆర్డినెన్సులను శాసనసభ, శాసన మండలి ఆమోదించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.. ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్లు: ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఆమోదానికి రానున్న ఆర్డినెన్స్ల…
టీడీపీ పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. లోకేష్ ఎన్ని జన్మలు ఎత్తినా.. ఎమ్మెల్యే అవ్వగలడా…? అంటూ చురకలు అంటించారు. వైజాగ్ కు పరిపాలన రాజధాని తరలింపు న్యాయ పరిధిలో ఉన్నాయి.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ నుండి తాము పారిపోమన్నారు.ఈ రాష్ట్రంలో మాకో అడ్రెస్ ఉంది..ప్రతిపక్ష నేతలే వలస పక్షులు అంటూ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మాకు మిత్ర పక్షం కాదని… తమకు బీజేపీ రాజకీయ మిత్రపక్షం కాదని తెలిపారు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో…
దాచేపల్లి, గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసింద న్నారు. నామినేషన్లు అడ్డుకొని పరిశీలనలో తొలగించడం, అభ్యర్థు లను కిడ్నాప్ చేయాలని చూడటం, పోలింగ్ బూత్లను ఆక్రమించు కోవాలని చూడటం ఇవన్నీ ఏంటని ఆయన ప్రశ్నించారు. జంగ మహేశ్వరపురంలో నామినేషన్స్ వేయకుండా అడ్డుకున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలానే ఉపయోగిం చారంటూ…
కుప్పం మొత్తం ఓటర్లు సుమారుగా 37 వేలు. మొదటి సారి మున్సిపాలిటీ అయిన కుప్పం ఎన్నికల గురించి చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే బాధేసింది అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇటువంటి వ్యక్తిని రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఎలా భరించింది అనిపించింది. జనసేన, టీడీపీ, బీజేపీ ఒకే తాను ముక్కలు. ఈ మూడు పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు కుప్పాన్ని చెరబట్టారు. ఆయన చెరలో కుప్పం దశాబ్దాలుగా నలిగిపోయింది.…
వైసీసీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన లోపాయికారి ఒప్పందాలకు వెళ్లాయన్నారు. కుప్పం కోట తొలిసారి బద్ధలైంది అన్నారు. మా ప్రభుత్వ పనితీరును వివరిస్తూ ఓట్లు అడిగాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదం ఉందన్నారు. ఐఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులంటే చంద్రబాబు…
ఏపీలో పురపోరు ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 36 సర్పంచ్లకు, 68 పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుల్లయ్యగూడెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా…
విశాఖ:- 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవుతుందని… ఆ పార్టీ అంతర్ధానం అయిపోతుందని వైసీపీ ఎండీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద నాయకులు మాతో టచ్ లో వున్నారు..చర్చలు జరుగుతున్నాయన్నారు. పనితీరు ఆధారంగా అందరికీ సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ నుంచి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో ముఖ్య నాయకులు చేరారు. గతంలో టిక్కెట్లు ఆశించి పార్టీ నుంచి బయటకు వెళ్లిన నాయకులను తిరిగి అహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..…