టాలీవుడ్తోపాటు బాలీవుడ్లోనూ అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న అందాల నటి జయప్రద చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. రాజమండ్రిలో బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆమె తళుక్కుని మెరిశారు. రాజమండ్రి తన జన్మభూమి అయితే.. ఉత్తరప్రదేశ్ తన కర్మభూమి అని సభలో జయప్రద చేసిన కామెంట్స్ చర్చగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. రాజమండ్రిలో పుట్టిన జయప్రద చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి వరకు…
కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మాజీ హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.. అమలాపురం అల్లర్ల సంఘటనలో పోలీసులు, ఇంటిలిజెన్స్ వైఫల్యం ఉందని ఆయన ఆరోపించారు. ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్ల ఘటనలో వైసీపీ వారు చెప్పారని అమాయకులను బలిచేస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తే టీడీపీ వారు చేస్తున్నారని మంత్రి విశ్వరూప్…
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్ను యాక్టివ్ మోడ్లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత…
పీతల సుజాత.. కొత్తపల్లి జవహర్. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈ ఇద్దరు టీడీపీ నేతలు గతంలో మంత్రులుగా పనిచేశారు. 2014లో చింతలపూడి నుంచి సుజాత, కొవ్వూరు నుంచి జవహర్ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరూ స్థానికేతరులైనప్పటికీ.. అక్కడ టీడీపీకి బలం ఉండటంతో అసెంబ్లీలో ఆనాడు ఈజీగానే అడుగు పెట్టేశారు. గత ప్రభుత్వంలో ముందుగా సుజాత.. తర్వాత జవహర్ కేబినెట్ మంత్రులయ్యారు. గెలిచిన కొత్తలో బాగానే ఉన్నా.. మంత్రులయ్యాక నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయి.…
పవన్ కళ్యాణ్ రియల్ హీరో కాదు.. రీల్ హీరో మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. సినిమాల్లో పవన్ ప్రధాని, సీఎం, గవర్నర్ కూడా కావొచ్చని.. కానీ రియల్ లైఫ్లో ఆయన సీఎం కాలేడని ఆమె జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు లేదని మంత్రి రోజా మండిపడ్డారు. గుంటూరులో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె ట్రాక్టర్ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…
ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజుల్లోనే ఎన్నికల సమరం జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారంతో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. మొత్తం 28 నామినేషన్లలో 13 మంది అభ్యర్థుల నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఆత్మకూరు ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ దూరంగా ఉండటంతో పోటీ ప్రధానంగా వైసీపీ, బీజేపీల…
విద్యుత్ మీటర్ల గుర్చి ప్రతిపక్షాలు మాటాడుతున్నాయని.. అసలు మీటర్ సిస్టమ్ పెట్టిందే చంద్రబాబు అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. విద్యుత్ మీటర్ సిస్టమ్ ప్రవేశపెట్టలేదని చంద్రబాబును చెప్పమనండంటూ సీతారాం ప్రశ్నించారు. రైతుకు కావలసిన విద్యుత్ డైవర్షన్స్ను అరికట్టేందుకే ఈ మీటర్ల ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. మీటర్లు పెట్టకపోతే విద్యుత్ మిగుల్చుకోలేమన్న ఆయన.. సిస్టమ్ కరెక్ట్ చేసి రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తే తప్పా అంటూ ప్రశ్నించారు. Devineni Uma: మంత్రి అంబటి కుట్రలు,…
ఒకటి బీజేపీ – టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయటం.రెండోది టీడీపీ – జనసేన కలిసి ప్రభుత్వం స్థాపించటం.మూడోది జనసేన ఒంటరిగా అధికారంలోకి రావటంఈ మూడు ఆప్షన్లే ఉన్నాయంటున్నారు వపన్ కల్యాణ్..పొత్తుల విషయంలో తానే కాదని..టీడీపీ కూడా తగ్గాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు.పొత్తుల విషయంలో గతంలో వన్సైడ్ లవ్ అంటూ కామెంట్స్ చేసిన చంద్రబాబుకు పరోక్ష సంకేతాలు ఇచ్చారు పవన్ కల్యాణ్. గతంలో కుప్పంలో ఓ ర్యాలీలో కార్యకర్తల ప్రశ్నలకు చంద్రబాబు ఆసక్తికరంగా…
పవన్ కామెంట్లు టీడీపీని డిఫెన్సులో పడేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జాగ్రత్త పడతాననే పవన్ కామెంట్లతో, తమతో కలిసి పని చేయడానికి సంసిద్దతను పవన్ తన కామెంట్ల ద్వారా తెలిపారని జనమంతా భావించారు. అదే తరహాలో టీడీపీ కూడా అనుకుంది. ఆ తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో కూడా పవన్ ఇదే తరహాలో మాట్లాడితే పొత్తు పక్కా అని తమ్ముళ్లూ ఫిక్స్ అయినట్టే కన్పించారు. చంద్రబాబు ఏం కోరుకుంటున్నారో, దానికి అనుగుణంగానే…
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకు వైసీపీ పేరుతో ఇంటింటికీ తిరుగుతున్నారు. వైసీపీ మూడేళ్ల పాలన పూర్తి కావడం, ఇక రెండేళ్లు వుండటం, రెండేళ్లలో ఒక ఏడాది ఎన్నికల సంవత్సరం కావడంతో, హరీబరీగా తిరుగుతున్నారట. ఇక నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజల మధ్యలో ఉండాలని అధిష్టానం ఆదేశించింది. గడపగడపకు వైసీపీ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఎంతెంత ఇచ్చింది…పథకాల గురించి ప్రచారం చేయాలని ఆదేశించింది. అంతవరకూ బాగానే…