YCP : మంగళగిరిలో పట్టు బిగించే పనిలో.. వైసీపీ వ్యూహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు జిల్లా మంగళగిరి. 2014 నుంచి మంగళగిరి రాష్ట్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. సీఎం జగన్తోపాటు విపక్షనేత చంద్రబాబు కూడా ఇదే నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. అందుకే మంగళగిరిపై పట్టుకోసం రెండు పార్టీలు వ్యూహాత్మకంగా మందుకెళ్తుంటాయి. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చెయ్యడంతో చాలా హైప్ వచ్చింది. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడం.. ఆళ్ల రామకృష్ణారెడ్డి వరసగా గెలవడం పెద్ద చర్చకే దారితీసింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి ఇక్కడి నుంచే పోటీ చేస్తానంటున్నారు లోకేష్. ఈక్రమంలో మంగళగిరిలో మరింత పట్టు బిగించేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలు రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ వ్యూహం చుట్టూనే చర్చ సాగుతోంది.
మంగళగిరిలో పద్మశాలీ సామాజికవర్గం ఓటర్లు సుమారు 50వేల వరకూ ఉన్నారు. వీరంతా ఎటు మొగ్గు చూపితే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువ. గత రెండు ఎన్నికల్లో గెలిచిన ఆర్కేకు మంగళగిరి టౌన్ మైనస్ అయ్యింది. రెండుసార్లూ ఆయనకు మెజారిటీ రాలేదు. తాడేపల్లి మండలంలో రెడ్డి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో.. మంగళగిరి టౌన్లో ఎదురైన మైనస్ను అలా భర్తీ చేసుకుంటూ వచ్చారు. ఈసారి వైసీపీ ప్లాన్ మార్చిందని టాక్. మంగళగిరిలో ఉన్న బీసీ నేతలందరినీ క్యాప్చర్ చెయ్యాలని మాస్టర్ ప్లాన్ వేసింది. అందులో భాగంగానే పద్మశాలీ నేతగా ఉన్న చిల్లపల్లి మోహన్రావుకు ఆప్కో ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. తెలుగుదేశానికి రాజీనామా చేసిన వైసీపీలో చేరకముందే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టింది వైసీపీ. మంగళగిరి పట్టణ అధ్యక్ష పదవి కూడా చేనేత సామాజికవర్గానికి చెందిన మునగాల మల్లేశ్వరావుకు ఇచ్చారు. ఆయన భార్య భాగ్యలక్ష్మిని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి వరించింది. మంగళగిరి యార్డు చరిత్రలో ఇప్పటివరకూ చేనేతలకు ఛైర్మన్ పదవి ఇవ్వలేదు. మొదటిసారిగా ఆ పదవిని చేనేతలకు కట్టబెట్టి ఆ సామాజికవర్గాన్ని ఆకర్షించే ఎత్తుగడ వేసింది.
Also Read
ఇంతటితో ఆగకుండా చేనేత సామాజికవర్గం ఓటర్లను పూర్తిస్థాయిలో తమవైపు తిప్పుకునేందుకు మరిన్ని పదవులు ఇవ్వాలని భావిస్తున్నట్లు మంగళగిరిలో ప్రచారం జరుగుతుంది. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాండ్రు కమలకు కీలక పదవి ఇవ్వబోతున్నారట. తాడేపల్లి-మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్కు కమలను మేయర్ను చేస్తారని అనుకుంటున్నారు. కమల బరిలో ఉంటే గెలుపు ఈజీ అనే లెక్కలు వేస్తున్నారట. మురుగుడు హనుమంతరావుకు కాండ్రు కమల వియ్యపురాలు. హనుమంతరావు గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్గా పనిచేశారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాండ్రు కమల కూడా మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. చేనేత సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టుంది. అందుకే ఇద్దరికీ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గం మొత్తం వైసీపీకి అండగా ఉంటుందనేది అధిష్టానం ఆలోచన. అంతేకాదు ఎన్నికల సమయానికి టీడీపీలో ఉన్న చేనేత సామాజికవర్గానికి చెందిన కీలక నేతను కూడా వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో వైసీపీ నేతలు బిజీగా ఉన్నారట. మరి.. ఈ వ్యూహం అధికారపార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
- Tags
- Chandra babu
- jagan
- Mangalagiri
- tdp
- ycp
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?