Minister Karumuri: టీడీపీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారని.. ప్రశ్నించారు. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ను కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నాడని విమర్శించాడు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ లోకి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని అడిగారు.
అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.?, మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. గతంలో బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశామని అన్నారు.బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడని.. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిదని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారని.. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని కారుమూరి అన్నారు.
Also Read
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
బీసీలను చంద్రబాబు ఓట్లేసే యంత్రాలుగానే చూవారని.. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదని వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రపంచమంతా కూడా కరోనా రాకుండా చంద్రబాబు ఆపేవారేమో ..? అని ఎద్దేవా చేశారు. తుపానులు ఆపుతానంటాడు, ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు, ఇలాంటి పిచ్చి మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారని.. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని..చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారని.. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదని.. ఇక ఇంటికొకరు ఏం వస్తారు అని సెటైర్లు వేశారు. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ ని విమర్శిస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..