Minister Karumuri: టీడీపీని కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయ్యన్న పాత్రుడి విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని.. మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆయన అన్నారు. చంద్రబాబు అసలు ఏ పార్టీ నుంచి వచ్చారని.. ప్రశ్నించారు. టీడీపీలోకి వెళ్లి ఆ పార్టీని, ఆ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ ను కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. చంద్రబాబు తరహాలోనే అయ్యన్న పాత్రుడు నడుస్తున్నాడని విమర్శించాడు. మీరు తప్పు చేసి దాన్ని బీసీలపై రుద్దటం ఏంటని ప్రశ్నించారు. బీసీలు సెక్రటేరియట్ లోకి వస్తే తోక కట్ చేస్తానన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తి బీసీలకు ఎలా న్యాయం చేస్తారని అడిగారు.
అయ్యన్నపాత్రుడు తప్పు చేస్తే చూస్తూ ఊరుకోవాలా.?, మహిళలు, ఎస్సీల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేశారని అన్నారు. గతంలో బాలకృష్ణ మహిళల గురించి ఎంతటి దారుణమైన వ్యాఖ్యలు చేశారో చూశామని అన్నారు.బుద్దా వెంకన్న పది ఇళ్లు కూల్చుతానంటున్నాడని.. బెజవాడలో మహిళలతో కాల్ మనీ సెక్స్ రాకెట్ నడిపిన చరిత్ర అతనిదని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. రిషితేశ్వరి, వనజాక్షిపై దాడుల కేసుల్లో చంద్రబాబు ఏం చేశారో ప్రజలంతా చూశారని.. జగన్ వచ్చాకే బీసీలకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతోందని కారుమూరి అన్నారు.
Also Read
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
- OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్... మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
- YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
- OTR : ఉమ్మడి శ్రీకాకుళం రాజాం రాజకీయాల్లో హాట్ టర్న్! వైసీపీ పరిస్థితి ఏంటి?
బీసీలను చంద్రబాబు ఓట్లేసే యంత్రాలుగానే చూవారని.. మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్రలో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. తాను అధికారంలో ఉంటే కరోనా వచ్చేది కాదని వ్యాఖ్యలు చేస్తున్నారని.. ప్రపంచమంతా కూడా కరోనా రాకుండా చంద్రబాబు ఆపేవారేమో ..? అని ఎద్దేవా చేశారు. తుపానులు ఆపుతానంటాడు, ఉష్ణోగ్రత పది డిగ్రీలు తగ్గిస్తానంటాడు, ఇలాంటి పిచ్చి మాటలు విని జనం నవ్వుకుంటున్నారని అన్నారు.
చంద్రబాబు విజయవాడలో ఎన్ని గుడులు కూల్చారో జనం చూశారని.. మీ షూటింగ్ పిచ్చితో పుష్కరాల్లో జనాన్ని చంపారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతని..చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఒంటరిగా పోరాటం చేయాలని సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు సభకు వచ్చిన జనం జై జగన్ అంటున్నారని.. జగన్ పై పోరాటానికి టీడీపీ వారే రావటం లేదని.. ఇక ఇంటికొకరు ఏం వస్తారు అని సెటైర్లు వేశారు. కేంద్రంపై పోరాటం చేయలేక జగన్ ని విమర్శిస్తున్నారని విమర్శించారు.
తాజావార్తలు
-
RAPO23 : హీరో కమ్ దర్శకుడిగా రామ్ పోతినేని.. పూజ కార్యక్రమానికి టైమ్ ఫిక్స్
-
AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
-
Balan The Boy: 8 రోజుల్లో 24 కోట్ల వసూళ్లు.. మరో బ్లాక్ బస్టర్తో చిదంబరం మ్యాజిక్
-
Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
-
Sourav Ganguly: అతడు ఓ మూర్ఖుడు.. ఒకసారి మోసపోయా, రెండోసారి మోసపోను!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!