జగన్ రెడ్డి పాలనలో కేవలం రాజకీయ నిరుద్యోగల కోసమే బీసీ కార్పొరేషన్లు పెట్టారు.. బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పేరుకే బీసీలు.. అధికార పెత్తనం అంతా వైసీపీ అగ్ర కుల పెద్దలదే అని బనగానపల్లె టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి మండిపడ్డారు.
నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారంలో తాజా పరిణామాలపై హాట్ కామెంట్లు చేశారు మంత్రి అంబటి రాంబాబు.. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. పొత్తు ధర్మాన్ని పాటించక పోయినా చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పొత్తు ధర్మం లేకపోయినా, ప్యాకేజీ ధర్మం గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారా..? అని ఎద్దేవా చేశారు.. అసలు ఈ దేశంలో ఏ ధర్మాన్ని పాటించని వ్యక్తి చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. అందులో భాగంగా త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు.. పొత్తుల విషయంలో బీజేపీతో క్లారిటీ తీసుకోనున్నారు. పొత్తులపై బీజేపీ అధిష్టానంతో మంతనాలు జరపనున్నారు.. ఇక, పవన్ కల్యాణ్తో భేటీ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధర్మాన్ని ఆశ్రయించారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చివరివరకు ఉంటారనేది అనుమానమే అని పేర్కొన్నారు. పొత్తులు చివరివరకు ఉంటాయో? లేదో? చూడాల్సిందే అని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తాను చేసిన మోసాలు చూసి ఓటు వేయమని అడుగుతారా?, పవన్ ప్రజలను ఏమని ఓటు అడుగుతారు? అని మంత్రి కొట్టు విమర్శించారు. తండ్రి ఆశయాలను గాలికి వదిలేసి చంద్రబాబు స్క్రిప్ట్ను ఏపీ కాంగ్రెస్ చీఫ్…
Pawan Kalyan Says Janasena Will contest from Razole and Rajanagaram: ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం రెండు స్థానాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజోలు, రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించడాన్ని జనసేనాని తప్పుబట్టారు. టీడీపీ అభ్యర్తుల ప్రకటనపై బాబు పొత్తు ధర్మం పాటించలేదని పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తుల్లో ఒక మాట…