Bode Prasad: కృష్ణా జిల్లా ఉయ్యూరులోని 4, 5 వార్డుల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక చేతగాని అసమర్థుడిని, అవినీతి పరుడిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా వైసీపీ పార్టీ నిలబెట్టింది.. అంటూ మంత్రి జోగి రమేష్పై విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలో టీడ్కో గృహాలు 80 శాతం పూర్తి అయ్యాయి. అయితే, లబ్దిదారుల దగ్గర రూ. 25 వేలు, రూ. 50 వేలు, లక్ష రూపాయలను ఆ రోజు డిపాజిట్ గా కట్టించుకుంటే.. మళ్లీ ప్రభుత్వం ఆ గృహాలపై లోన్లు తీసుకుంటే.. ఇప్పుడు లబ్దిదారులకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్దుడు అని ఎందుకన్నామంటే.. టిడ్కో గృహాల్లో ఈయన గృహా నిర్మాణశాఖ మంత్రిగా ఉండి.. రాష్ట్రవ్యాప్తంగా ఏం వెలగబెట్టాడో తెలియదు.. పెడనలో ఏం వెలగబెట్టాడో తెలియదు.. కానీ, కనీసం, ఉయ్యూరికి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినప్పుడు టిడ్కో గృహాల లబ్దిదారులకు అందించాలనే జ్ఞానం లేని ఒక శాసనసభ్యున్ని, ఒక అవినీతి పరున్నీ ఇక్కడ అభ్యర్థిగా నిలబేట్టారని విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలోని 2500 టిడ్కో గృహాలు ఈ రోజు శిథిలం అయిపోయే విధంగా వీళ్లు నాశనం చేశారు అని దుయ్యబట్టారు… వీళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలి.. అలాగే, రాష్ట్రం పట్ల వీరి ఆలోచన విధానం అర్థం చేసుకోవాలని అని సూచించారు మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోడె ప్రసాద్.
Read Also: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!