Bode Prasad: జోగి రమేష్పై బోడె ప్రసాద్ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad: కృష్ణా జిల్లా ఉయ్యూరులోని 4, 5 వార్డుల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక చేతగాని అసమర్థుడిని, అవినీతి పరుడిని తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో అభ్యర్థిగా వైసీపీ పార్టీ నిలబెట్టింది.. అంటూ మంత్రి జోగి రమేష్పై విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలో టీడ్కో గృహాలు 80 శాతం పూర్తి అయ్యాయి. అయితే, లబ్దిదారుల దగ్గర రూ. 25 వేలు, రూ. 50 వేలు, లక్ష రూపాయలను ఆ రోజు డిపాజిట్ గా కట్టించుకుంటే.. మళ్లీ ప్రభుత్వం ఆ గృహాలపై లోన్లు తీసుకుంటే.. ఇప్పుడు లబ్దిదారులకు నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమర్దుడు అని ఎందుకన్నామంటే.. టిడ్కో గృహాల్లో ఈయన గృహా నిర్మాణశాఖ మంత్రిగా ఉండి.. రాష్ట్రవ్యాప్తంగా ఏం వెలగబెట్టాడో తెలియదు.. పెడనలో ఏం వెలగబెట్టాడో తెలియదు.. కానీ, కనీసం, ఉయ్యూరికి అభ్యర్థిగా ఇక్కడికి వచ్చినప్పుడు టిడ్కో గృహాల లబ్దిదారులకు అందించాలనే జ్ఞానం లేని ఒక శాసనసభ్యున్ని, ఒక అవినీతి పరున్నీ ఇక్కడ అభ్యర్థిగా నిలబేట్టారని విరుచుకుపడ్డారు. ఉయ్యూరు పట్టణంలోని 2500 టిడ్కో గృహాలు ఈ రోజు శిథిలం అయిపోయే విధంగా వీళ్లు నాశనం చేశారు అని దుయ్యబట్టారు… వీళ్ల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ప్రజలు గమనించాలి.. అలాగే, రాష్ట్రం పట్ల వీరి ఆలోచన విధానం అర్థం చేసుకోవాలని అని సూచించారు మాజీ ఎమ్మెల్యే, పెనమలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బోడె ప్రసాద్.
Read Also: Mayank Agarwal Health Update: నిలకడగా మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం.. నేడు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!