ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయా అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఒకట్రెండు రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో పరిస్థితులు, పొత్తులపై బీజేపీ అధిష్ఠానం సమాలోచనలు చేస్తోంది.
స్త్రీ శక్తి స్వరూపిణి అని, మహిళలు కన్నెర్ర జేస్తే వైసీపీ గల్లంతవుతుందన్నారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి. గన్నవరంలోని ఏబీ కల్యాణ మండపంలో శుక్రవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి తెలుగు మహిళా సమావేశంలో వెంకట్రావుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు.
లివెందుల టీడీపీ నేత వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. కృష్ణా జిల్లాలోని పెనమలూరు సీటుపీ టీడీపీలో చిక్కుముడి ఇంకా వీడడం లేదు.
మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది.
Mantralayam : తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పార్టీ కీ చాలా తీరని లోటు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నేత పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.…
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.
బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడానికి ఎమ్మిగనూరు పట్టణంలో డాక్టర్ మాచాని సోమనాథ్ సైకిల్ యాత్రను చేపట్టారు.
‘చంద్రబాబు అన్నా.. తెలుగుదేశం పార్టీ అన్నా నాకు ప్రాణం. ఇతర పార్టీల నేతలు కూడా నాతో మాట్లాడారు కానీ స్పందించలేదు. 14 నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా. పక్కన నియోజక వర్గ నేతలకు ఇచ్చిన గౌరవం కూడా నాకు ఇవ్వలేదు. నేను ఆవేదనతో మాట్లాడుతున్నా. దళారీలను పక్కనపెట్టి చంద్రబాబు నేరుగా నివేదిక తీసుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాను కానీ వీలు కాలేదు. వచ్చే నెల 2న నెల్లూరుకు వస్తున్న చంద్రబాబుతో…