AP BJP Key Meeting: రెండో రోజు ఏపీ బీజేపీ నేతలతో అధిష్టానం కీలక భేటీ.. పొత్తులపై నేడు క్లారిటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP BJP Key Meeting: ఏపీలో పొత్తులపై బీజేపీ ఎటూ తేల్చడం లేదు. ఇప్పటికే టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి లిస్ట్ను రిలీజ్ చేశారు ఆ పార్టీ అధినేతలు. ఈ పొత్తులో తమతో పాటు బీజేపీ కూడా కలుస్తుందని జనసేన అధినే పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఏపీలో ఒంటరిగా పోటీ చేయాలా? లేకుంటే టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై హై కమాండ్ ఎటూ తేల్చడం లేదు. పొత్తుపై ఏ విషయమో క్లారిటీ వస్తే సెకండ్ లిస్ట్ ప్రకటించేందుకు చూస్తుంది టీడీపీ – జనసేన కూటమి. కానీ బీజేపీ మాత్రం కాలయాపన చేస్తూ ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. మరికొన్ని రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. అయినా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దీంతో ఇటు ఏపీ బీజేపీతో పాటు టీడీపీ – జనసేన రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
లోక్సభ ఎన్నికల ఎలాగైనా మెజార్టీ సాధించాలని చూస్తుంది బీజేపీ. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటనలు చేస్తుండగా.. మరోవైపు బీజేపీ హైకమాండ్ సమావేశాలు నిర్వహిస్తుంది. నిన్న ఢిల్లీలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా అధ్యక్షతన సమావేశం జరిగింది. మీటింగ్లో కోర్ గ్రూప్ ఏపీ బీజేపీతో కూడా సమావేశమైంది. అయితే పొత్తులపై మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు..కోర్ కమిటీతో భేటీ అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ రెడీ చేసిన 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాల ఆశావహుల లిస్టులను అధిష్టానం ముందు పెట్టారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను ఢిల్లీ పెద్దలకు వివరించారు. ఈ సమావేశంలో పొత్తులపై క్లారిటీ వస్తుందనుకున్నారు నేతలు. అయితే పొత్తుల అంశంపై చర్చకు రాలేదని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారి అధిష్ఠానంతో సమావేశం కానున్నారు ఏపీ బీజేపీ నేతలు. దీంతో ఇవాళైనా పొత్తులపై చర్చకు వస్తుందా? బీజేపీ హైకమాండ్ క్లారిటీ ఇస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Ranabaali: రణబాలి రిలీజ్పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
-
Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!