TDP-Janasena-BJP Alliance: బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు..! నేడు సస్పెన్స్కు తెర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP-Janasena-BJP Alliance: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుపై ఓ నిర్ణయానికి వచ్చారు.. దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది. మధ్యాహ్నం లోపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని నేతలు చెబుతున్నమాట.. ఇక, నిన్న రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్తో సుదీర్ఘ చర్చలు జరిపారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా.. అయితే, ఆ చర్చల వివరాలను నేడు ఏపీ బీజేపీ నేతలతో చర్చించనున్నారు పార్టీ పెద్దలు.. ఆ తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది అంటున్నారు.
Read Also: Samantha : హాట్ అందాలతో సమంత బోల్డ్ ట్రీట్.. దారుణంగా ట్రోల్స్..
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
మొత్తంగా ఏపీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న పొత్తులకు నేడు తెరపడనుంది.. ఢిల్లీలో.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో పాటు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ చర్చలు జరిపారు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఈ భేటీల్లో ఏపీలో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు వచ్చాయి టీడీపీ-జనసేన-బీజేపీ.. కాళహస్తి, జమ్ములమడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలు కావాలని బీజేపీ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, బీజేపీకి ఐదు లోకసభ స్థానాలు కేటాయించడంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారట.. తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం లోక్సభ స్థానాల నుంచి బీజేపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపనుండగా.. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంట్ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ రోజు పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సీట్ల వ్యవహారం తేలబోతోంది అంటున్నారు.. ఇక, ఈ రోజు మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండబోతున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!