Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- తీవ్ర దుమారం రేపుతోన్న రామమందిర విరాళాల స్కామ్
- రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే
- బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణం అంశం రచ్చరచ్చ చేస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లిపోయాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకోవైపు యోగి ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ బీజేపీపై ధ్వజమెత్తారు. రామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి ఇప్పుడు ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ‘‘తాము హిందూ ప్రభుత్వం, సనాతన ప్రభుత్వం అని బీజేపీ చెప్పుకుంది. రామ్ మందిరం నిర్మాణం పేరుతో దేశంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించింది. కానీ ఇప్పుడు అదే రామ్ మందిరం విరాళాల వ్యవహారంలో ఏం జరుగుతోంది? టెట్, నీట్ పేపర్ లీక్ల విషయంలోనూ బీజేపీ దగ్గర సమాధానం లేదు.’’ అని విమర్శించారు.
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషియల్ యాక్టివిటీస్ బిల్’’ గురించి స్పందిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘బెంగాల్లో యాంటీ-గూండా చట్టం తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ అసలు గూండాలు బీజేపీలోనే కూర్చున్నారు. వారు ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగిలించే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ ఆటలు ఆపండి. ముందుగా రామ్ మందిరం విరాళాల వ్యవహారంపై సమాధానం చెప్పండి. మీ చర్యలపై దేశ ప్రజలకు జవాబు ఇవ్వండి.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అలాగే ‘‘ప్రజలు ఒక పార్టీ గుర్తుపై గెలిపించిన ప్రజాప్రతినిధులను మరో పార్టీలోకి లాగడం గురించి దేశ ప్రజలకు ఆసక్తి లేదు. రామ్ మందిరం విరాళాల కేసు, టెట్-నీట్ అవకతవకలపై బీజేపీ వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.’’ అని మహువా మొయిత్రా అన్నారు.
#WATCH | Kolkata, West Bengal: On the alleged Ram Mandir donation embezzlement case and paper leaks, TMC MP Mahua Moitra says, "…They (BJP) claimed to be a 'Hindu government,' a 'Sanatan government.' They incited riots and sowed division among people in every city and village… pic.twitter.com/PZQu1vLxKF
— ANI (@ANI) June 29, 2026
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!