Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- తీవ్ర దుమారం రేపుతోన్న రామమందిర విరాళాల స్కామ్
- రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే
- బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అయోధ్య రామమందిరం విరాళాల కుంభకోణం అంశం రచ్చరచ్చ చేస్తోంది. కోట్లాది రూపాయలు దారి మళ్లిపోయాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇంకోవైపు యోగి ప్రభుత్వం నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరిపిస్తోంది.
తాజాగా ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా స్పందిస్తూ బీజేపీపై ధ్వజమెత్తారు. రామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీకి ఇప్పుడు ఈ అంశాలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. ‘‘తాము హిందూ ప్రభుత్వం, సనాతన ప్రభుత్వం అని బీజేపీ చెప్పుకుంది. రామ్ మందిరం నిర్మాణం పేరుతో దేశంలోని ప్రతి నగరం, ప్రతి గ్రామంలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించింది. కానీ ఇప్పుడు అదే రామ్ మందిరం విరాళాల వ్యవహారంలో ఏం జరుగుతోంది? టెట్, నీట్ పేపర్ లీక్ల విషయంలోనూ బీజేపీ దగ్గర సమాధానం లేదు.’’ అని విమర్శించారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషియల్ యాక్టివిటీస్ బిల్’’ గురించి స్పందిస్తూ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘బెంగాల్లో యాంటీ-గూండా చట్టం తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. కానీ అసలు గూండాలు బీజేపీలోనే కూర్చున్నారు. వారు ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలను దొంగిలించే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆ ఆటలు ఆపండి. ముందుగా రామ్ మందిరం విరాళాల వ్యవహారంపై సమాధానం చెప్పండి. మీ చర్యలపై దేశ ప్రజలకు జవాబు ఇవ్వండి.’’ అని ఆమె వ్యాఖ్యానించారు.
అలాగే ‘‘ప్రజలు ఒక పార్టీ గుర్తుపై గెలిపించిన ప్రజాప్రతినిధులను మరో పార్టీలోకి లాగడం గురించి దేశ ప్రజలకు ఆసక్తి లేదు. రామ్ మందిరం విరాళాల కేసు, టెట్-నీట్ అవకతవకలపై బీజేపీ వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.’’ అని మహువా మొయిత్రా అన్నారు.
#WATCH | Kolkata, West Bengal: On the alleged Ram Mandir donation embezzlement case and paper leaks, TMC MP Mahua Moitra says, "…They (BJP) claimed to be a 'Hindu government,' a 'Sanatan government.' They incited riots and sowed division among people in every city and village… pic.twitter.com/PZQu1vLxKF
— ANI (@ANI) June 29, 2026
తాజావార్తలు
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
-
NTRIVIKRAM: పురాణాలకు, జన్యుశాస్త్రానికి లింక్.. ఏం చేస్తున్నావయ్యా త్రివిక్రమ్?
-
France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
-
ENE Repeat : అంతా ఒకే కానీ, రిలీజ్ అదే రోజు ఎందుకంటే?
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!