మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తీవ్రస్దాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా నీ స్దాయి ఏంటి.. నోటికోచ్చినట్లు మాట్లాడటం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదానికి ఒక మంచి భాషా కూడా మాట్లాడలేకున్నావ్.. ఒకప్పుడు చెక్ బౌన్స్ అయినా నువ్వు ఇప్పుడు వందల ఎన్ని కోట్లు ఎలా సంపాదించావో సీబీఐ ఎంక్వైరి కోరే దమ్ము నీకుందా అని ఆమె ప్రశ్నించారు.
రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (67) కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Legislative Council Chairman Moshen Raju Serious On TDP MLC’s. ఏపీలో సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్ మండలికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధగా ఉందని, మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే…
డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి కొడాలి నానిపై విమర్శలు చేశారనే ఆరోపణలపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను సోమవారం సాయంత్రం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అమరావతి వన్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి సోమవారం అర్ధరాత్రి బుద్ధా వెంకన్న బెయిల్పై విడుదలయ్యారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆయన్ను పోలీసులు విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2),…
వైసీపీ దిగజారిపోయింది అనడానికి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు అన్నారు. తెలంగాణకు చెందిన పోలీస్ అధికారి అరకులో గంజాయి ఉందని నిరూపించడానికి ప్రయత్నించి భంగపడ్డాడన్నారు. పోలీస్ అధికారిని ఉద్దేశించి అలా మాట్లాడే బదులు, తాము గంజాయి అమ్ముతున్నామని విజయ సాయి చెప్పాల్సింది. ఆ పోలీస్ అధికారి టీడీపీ మనిషన్నట్లుగా కూడా విజయసాయి మాట్లాడారు. కేసీఆర్ కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపాలని, తనరాష్ట్ర పోలీస్ అధికారులతో చెప్పారు. అంతమాత్రాన కేసీఆర్…
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలలో వైసిపి అధికార దుర్వినియోగం కు పాల్పడుతోందని ఛీఫ్ ఎలక్చ్రోల్ ఆఫీసర్ విజయానంద్ కు ఫిర్యాదు చేసింది టీడీపీ. అయితే అక్కడ ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ… తిరుపతి ఉప ఎన్నికలలో ఓబిలి, వాకాడు, ఏర్పేడు పోలీస్ స్టేషన్ల సిఐ, ఎస్ఐలను ఎన్నికల విధుల నుంచి తప్పించాలి. టీడీపీ ఏజంట్లను పెట్టుకొకుండా వీరు బెదిరింపులు చేస్తున్నారు. ఇదే అంశంపై సీఈఓ విజయానంద్ కు ఫిర్యాదు చేశాం. స్థానికేతరులను తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో…