Moshen Raju : మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Legislative Council Chairman Moshen Raju Serious On TDP MLC’s.
ఏపీలో సంచలనం సృష్టించిన జంగారెడ్డిగూడెం మరణాలపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చించాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సీఎం జగన్ మండలికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. అయితే జంగారెడ్డి గూడెం మరణాలపై ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధగా ఉందని, మరణాలపై ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని ప్రకటన చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే సీఎం జగన్ నిన్న ఇచ్చిన స్టేట్ మెంట్ తరువాత ఆరోగ్య శాఖ స్టేట్మెంట్ పనిచేయదని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.
Also Read
దీంతో మండలి చైర్మన్ మోషన్ రాజు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శాసనమండలి కొచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని తెలుగుదేశం సభ్యులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని, ముందు ప్రభుత్వం ఏం చెబుతుందో వినండని ఆయన అన్నారు. మంత్రి స్టేట్మెంట్ తర్వాత తెలుగుదేశం సభ్యులకు మాట్లాడడానికి అవకాశం ఇస్తామన్నారు. మంత్రి స్టేట్మెంట్ను తెలుగుదేశం సభ్యులు వినకపోతే ఎలా.. మీ ఇష్టం వచ్చినట్లు సభ నడవాలంటే కుదరదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..