UPI 123 PAY: దేశంలో డిజిటల్ విప్లవం దూసుకెళ్తోంది. మార్కెట్ లో కూరగాయల వ్యాపారులు డిజిటల్ చెల్లింపులు ఎలా చేస్తారని ప్రశ్నించిన వారందరి నమ్మకాలను వమ్ము చేస్తూ దేశంలో గత కొన్నేళ్లుగా డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకారం.. యూపీఐ ద్వారా ప్రతీ నెల రూ. 1000 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కూరగాయల విక్రేతల నుంచి కార్పొరేట్ ఉద్యోగి వరకు భారతదేశంలో ప్రతీ వ్యక్తి డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు.