Tamil Nadu: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ అధ్యక్ష రేసులో లేనని చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో అన్నామలై నిర్ణయం షాక్కి గురిచేసింది. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య పొత్తు చిగురిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. గత వారం అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి, పార్టీ ముఖ్య నేతలు ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు నేపథ్యంలోనే అన్నామలై పార్టీ…
సార్వత్రిక ఎన్నికల వేళ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ గవర్నర్ గా ఉన్నప్పుడు తనకు తెలంగాణ ప్రజల మధ్య బీఆర్ఎస్ నేతలు గ్యాప్ క్రియేట్ చేశారని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం ఇచ్చారు. నా ప్రియమైన తెలంగాణ సోదర సోదరీమణులారా.. నేను తెలంగాణ గవర్నర్ పదవి నుంచి వైదొలగుతున్నప్పుడు, అనేక భావోద్వేగాలతో మునిగిపోయాను. ఈ అద్భుతమైన రాష్ట్రానికి సేవ చేయడం చాలా ఆనందం కలిగించింది. అన్నింటికీ మించి తెలంగాణాలోని నా సోదర సోదరీమణుల ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుందని తెలిపారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో మాజీ గవర్నర్ తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తునందుకు బాధగా ఉంది.. కానీ తప్పడం లేదన్నారు. తెలంగాణ ప్రజలందరు నా అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు అని పేర్కొన్నారు. ఎప్పుడు తెలంగాణ ప్రజలను మరువను.. అందరితో కలుస్తూ ఉంటానని తెలిపారు. మరోవైపు.. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమో దాటవేస్తూ వెళ్ళిపోయారు.
గవర్నర్ తమిళిసై పై మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలు చేశారు. సిద్ధిపేటలో రూ.5 లక్షలతో నిర్మించే ఏకలవ్యమిత్ర మండలి భవనానికి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా ఎరుకలి కులానికి చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణకి కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.. కానీ గవర్నర్ మాత్రం ఆమోదించకుండా ఏ విధంగా అన్యాయం చేశారో అందరికీ తెలుసని ఆరోపించారు. కేసీఆర్ చేసిన దానిని రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది.. హైకోర్టు ఈ విషయాన్ని…
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాళోజీ కవితతో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించారు.. ప్రగతిభవన్ను.. ప్రజాభవన్గా అందుబాటులోకి వచ్చింది.. ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉన్నాం.. ఆరు గ్యారంటీలను అందుబాటులోకి తీసుకుచ్చాం.. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె చెప్పుకొచ్చారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
గవర్నర్ కోటా రెండు ఎమ్మెల్సీల భర్తీపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. తమ ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ కుమార్, కె. సత్యనారాయణ దాఖలు చేసిన రెండు పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ల నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఆ…
TamilaSai: తెలంగాణ గవర్నర్గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.