టీ20 ప్రపంచకప్ 2024 మ్యాచ్లో భాగంగా.. పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్లో ఉగాండా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2024 పురుషుల టీ20 ప్రపంచకప్లో ఉగాండా తన తొలి మ్యాచ్లో విజయం సాధించింది. రియాజత్ అలీ షా (33) పరుగులతో రాణించడంతో విజయాన్ని నమోదు చేసింది. 78 పరుగుల తక్కువ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా.. 3 వికెట్ల తేడాతో పపువా న్యూ గినియాను ఓడించింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన ఉగాండా జట్టు…
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. టీమిండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్ తో ఆడుతుంది. ఈ క్రమంలో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. 96 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. పూర్తిగా 20 ఓవర్లు ఆడకుండా.. కేవలం 16 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 3 వికెట్లతో చెలరేగాడు. ఇక.. ఐర్లాండ్ బ్యాటింగ్ విషయానికొస్తే, గారెత్ డెలానీ…
టీ20 ప్రపంచకప్లో భారత్ తన తొలి మ్యాచ్ ఐర్లాండ్తో తలపడుతోంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతోంది. ఇక.. పిచ్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని రోహిత్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫాస్ట్ బౌలర్లకు వాతావరణం మరియు పిచ్ రెండూ సహాయపడతాయి.
భారత క్రికెట్లో ధోనీ శకం ప్రారంభమైన సంవత్సరం 2007. MS ధోని సారథ్యంలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్ను ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ ఈ టోర్నీలో యువ జట్టుతో అడుగుపెట్టింది. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే వంటి స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఈ టోర్నీలో విజయం సాధించింది. స్టార్ ఆటగాళ్లు లేకుండా.. భారత్ ఛాంపియన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ధోని సారథ్యంలోని యువ…
టీ20 వరల్డ్ కప్ 2024కి జట్టును ప్రకటించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ చైర్మన్ రమీజ్ రజా అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మెగా టోర్నీకి సమయం తక్కువగా ఉంది. ఈ క్రమంలో.. పాకిస్తాన్ జట్టును ఇంకా ప్రకటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. మంగళవారం బంగ్లాదేశ్ కూడా తన జట్టును ప్రకటించిందని తెలిపారు. కాగా.. పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్లో పర్యటిస్తుంది.
విరాట్ కోహ్లీ, బ్యాటింగ్ ఫామ్ పట్ల టీమిండియా దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించారు. విరామం తర్వాత కూడా అంతకు ముందున్న దూకుడునే కోహ్లీ కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. విరాట్ తిరుగలేని ఫామ్లో కనిపిస్తున్నారు.. అత్యుత్తమంగా ఆడుతున్నారని అన్నారు. అంతేకాకుండా.. ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారని.. టీ20 వరల్డ్ కప్లో భారత్ తరుఫున ఇదే ఫామ్ను కొనసాగించాలని అనిల్ కుంబ్లే తెలిపారు.
టీ20 ప్రపంచ కప్ 2024 కోసం కౌంట్డౌన్ ప్రారంభమైంది. జూన్ 2 నుంచి వెస్టిండీస్, అమెరికా గడ్డపై మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కాగా.. మెగా టోర్నీకి భారత జట్టును ప్రకటించగా, అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై సెలక్టర్లు మరింత విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా.. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రింకూ సింగ్ వంటి పేర్లు ప్రధాన జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. అయితే, అగార్కర్ నేతృత్వంలో సెలెక్టర్లు అత్యుత్తమ 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని బీసీసీఐ సెక్రటరీ…
క్రికెట్లో ఆటగాళ్లు మైదానంలో దూకుడుగా కనిపించడం సహజం. దాంతో వారు కొన్నిసార్లు వారు తమ నిగ్రహాన్ని కోల్పోతారు. అయితే బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ పరిస్థితి వేరు. షకీబ్ మైదానంలోనే కాకుండా బయట కూడా కోపంగా కనిపిస్తాడు. ఇప్పటి వరకు అభిమానులు దురుసుగా ప్రవర్తించిన వీడియోలు చాలానే వచ్చాయి. నిజానికి షకీబ్ కు కోపం కాస్త ఎక్కువనే చెప్పొచ్చు. అతను తరచుగా హద్దులు దాటుతున్నాడు. అప్పుడప్పుడూ అభిమానులు, సహచరులు, మ్యాచ్ అధికారుల పట్ల దురుసుగా…
టీ20 వరల్డ్ కప్కు సరిగ్గా నెల సమయం కూడా లేదు. ఐపీఎల్ అయిపోయిన వెంటనే.. ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అమెరికా, వెస్టిండీస్ ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్.. జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ ను ఏంచక్కా ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులకు.. మరో పండగ ప్రారంభం కానుంది. అయితే.. ఈ మెగా టోర్నీని చూసేందుకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.