Film Chamber : ఫిలిం ఛాంబర్ వద్ద సినీ ప్రముఖులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఫిలిం ఛాంబర్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీలో మురళీ మోహన్, సురేష్ బాబు, శివాజీ రాజా, జెమినీ కిరణ్, అశోక్ కుమార్, ఏడిద రాజా, బసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, నరసింహారావు, శివనాగేశ్వరరావు, చంటి అడ్డాల తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిలిం నగర్ సోసైటీలో…
Mirai VFX : టీజీ విశ్వప్రసాద్కు తెలుగులో ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్ఆర్ఐగా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన, తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా 50 సినిమాలు దాదాపు పూర్తి చేశారు. అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే, చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్ట్లే ఉన్నాయి. నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు. అయినా, మరోపక్క ఇతర బిజినెస్లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్…
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్…
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్…
తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…
తెలుగు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్ ఎగ్జిబిటర్లు తీవ్ర నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలను అద్దె ప్రాతిపదికన ప్రదర్శించే విధానాన్ని నిలిపివేసి, కేవలం పర్సెంటేజ్ విధానంలోనే చెల్లింపులు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు ఈ షరతును అంగీకరించకపోతే, జూన్ 1, 2025 నుంచి థియేటర్లను మూసివేయాలని నిర్ణయించారు. ఈ అంశం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also Read:Balakrishna…
కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పనులు అప్పగించి మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించాడని కడప మేయర్ సురేష్ బాబుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టు పనులు అప్పగించిన అంశంపై కడప ఎమ్మెల్యే మాధవి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రజా ప్రతినిధిగా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. Also Read: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం! మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించిన అంశంలో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత అంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి అభిమానం. అందులోనూ చాలా నిర్మాణ సంస్థల్లో గతంలో ఆమె పనిచేసింది. వారందరితో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు గానీ.. వారితో ఆ మైత్రీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు సమంతకు అండగా నిలుస్తున్నాయి. ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాను తీసింది. దాదాపు ఏడు కోట్లతో తీసిన ఈ సినిమా బిజినెస్ ను కూడా బాగానే…