Anushree Satyanarayana: ఆ నలుగురు వీరే.. దిల్ రాజుపై కోర్టుకు వెళ్తా!
- దిల్ రాజు పై కోర్టుకు వెళ్తా: అత్తి సత్యనారాయణ
- నా రాజకీయ భవిష్యత్ పై దెబ్బ కొట్టారు
- ఆ నలుగురు దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునిల్ నారంగ్
- ఈ నలుగురే బంద్ కుట్ర వెనుక ఉన్నారు
- పవన్ కళ్యాణ్ వారి తొక్క తోలు తీసేస్తారు
- నా ప్రాణం ఉన్నంత వరకూ పవన్ కళ్యాణ్ తోనే ఉంటాను: అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ALso Read: Pawan Kalyan : ‘OG’ మూవీలో మరో హీరోయిన్..!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అత్తి సత్యనారాయణ తన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్ల కారణంగానే దిల్ రాజు తన పేరును జనసేనతో జోడించి మాట్లాడినట్లు ఆరోపించారు. “దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డిని కాపాడుకోవడానికి నా పేరును బంద్ వివాదంలోకి లాగారు. నేనెక్కడా థియేటర్ల బంద్ గురించి ప్రస్తావించలేదు. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సినిమాలు లేకపోతే థియేటర్లు మూసివేయాల్సి వస్తుందని మాత్రమే చెప్పాను,” అని సత్యనారాయణ స్పష్టం చేశారు.
జూన్ 1న థియేటర్ల బంద్ ప్రకటన చేసింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి అని, అయితే దిల్ రాజు తన సోదరుడిని కాపాడుకోవడానికి తనపై అబద్ధపు ఆరోపణలు చేశారని ఆరోపించారు. “దిల్ రాజు కమల్ హాసన్ను మించి ఆస్కార్ రేంజ్లో నటించారు. నా రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టారు. ఈ విషయంలో నేను కోర్టుకు వెళ్తాను,” అని ఆయన పేర్కొన్నారు.
ALso Read:Manchu Vishnu: సుప్రీమ్ కోర్టుకు మంచు విష్ణు
థియేటర్ల బంద్ కుట్ర వెనుక దిల్ రాజు, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్ నారంగ్ అనే నలుగురు ఉన్నారని ఆయన ఆరోపించారు. “ఈ నలుగురు కలిసి ఈ కుట్రను రచించారు. పవన్ కల్యాణ్ వీరి తొక్క తోలు తీసేస్తారు,” అని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, తాను జనసేన పార్టీకి విధేయుడిగా ఉంటూ, తన ప్రాణం ఉన్నంత వరకూ పవన్ కల్యాణ్తోనే ఉంటానని స్పష్టం చేశారు. తన బహిష్కరణ గురించి మాట్లాడుతూ ఈ వివాదం సినిమా వ్యవహారాలకు సంబంధించినదని, జనసేన పార్టీ తనను అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. “నా పార్టీ నాకు అగ్ని పరీక్ష పెట్టింది. కానీ, ఈ విషయం దిల్ రాజు కుట్ర అని నేను పార్టీకి వివరిస్తాను. రాజమండ్రి జనసైనికులు నా పరిస్థితి చూసి బాధపడుతున్నారు. ఈ విషయంలో నా పార్టీ నాకు న్యాయం చేస్తుందని నమ్ముతున్నాను,” అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!