New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ఇప్పటికే 21 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.
సుప్రీంకోర్టులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందుస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకునే హక్కు అవినాష్ రెడ్డికి ఉందని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంపీ అవినాష్రెడ్డి.. వెకేషన్ బెంచ్ జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ నరసింహ ధర్మాసనం ముందు అవినాష్ న్యాయవాది మెన్షన్ చేశారు. అయితే, పిటిషన్ తమ ముందుకు విచారణకు రావట్లేదని.. మరో వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని సుప్రీంకోర్టు…
Supreme Court: ఏదైనా ఒక ఇంటిని కానీ, ఇతర భవనాలను అమ్ముతున్న సమయంలో పాత విద్యుత్ బిల్లును విద్యుత్ బిల్లులను చెల్లించకపోవడం చూస్తుంటాం. ఇది కొత్తగా వాటిని కొనుగోలు చేసిన యజమానులపై పడుతుంది. అయితే వారు వాడిన కరెంట్ కు మేం ఎలా బిల్లు కడుతాం అనే ప్రశ్న ఇటువంటి సందర్భాల్లో ఉద్భవిస్తుంటుంది. ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
Power War: కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల పంచాయతీ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలు, నియామకాలపై దృష్టిసారించారు.
Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులో లభించిన శివలింగానికి శాస్త్రీయ సర్వే, కార్బన్ డేటింగ్ చేయడానికి మే 12న అలహాబాద్ హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై ఇంతేజామియా మసీద్ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాస్త్రీయ సర్వేను వాయిదా వేయాలని తీర్పు చెప్పింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడవాలి’’ అని కీలక వ్యాఖ్యలు చేసింది.
న్యాయవాదుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చిన మరుసటి రోజే శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ న్యాయవాది కేవీ విశ్వనాథన్ ప్రమాణ స్వీకారం చేశారు.
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. దీనిపై చిత్రనిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు అంశం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవల హిందూ పక్షం కోరుకున్న విధంగా మసీదులో బయటపడిన శివలింగం వంటి నిర్మాణానికి ‘కార్బన్ డేటింగ్’ పై అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మసీదులోని శివలింగం వయసును కనుగొనేందుకు శాస్త్రీయ పరిశోధన అవసరం హిందూపక్షం న్యాయవాది వాదించారు. దీంతో శివలింగం నిర్మాణానికి ఎలాంటి విఘాతం కలగకుండా కార్బన్ డేటింగ్ కు ఆదేశాలు ఇచ్చింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన…