ED Case: ఈడీ అధికారాలకు పగ్గాలు వేయాల్సిందే.. సుప్రీంకోర్టుకు కీలక విన్నపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED Case: భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కీలక విన్నపం వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఇచ్చిన అధికారాలకు పగ్గాలు వేయాలని లేకపోతే దేశంలో ఎవరూ ప్రశాంతంగా ఉండలేరని పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ పేరుతో దేశంలో బడా వ్యాపార వేత్తలతోపాటు.. ప్రముఖ రాజకీయ పార్టీల నేతలను సైతం విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈడీ అధికారాలకు పగ్గాలు వేయకపోతే ఇబ్బందులు ఎక్కువ అవుతాయని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేసు విచారణ సంద్భంగా సుప్రీం ధర్మాసనం కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. మనీలాండరింగ్ కేసులను దర్యాప్తు చేయడానికి ఇడికి కఠినమైన అధికారాలు ఇవ్వబడ్డాయని.. ఈ అధికారాలకు పగ్గాలు వేస్తే తప్ప.. భారతదేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరని సుప్రీంకోర్టు తెలిపింది.
Read also: Andhra Pradesh: అనకాపల్లిలో విషాదం.. ప్రాణం తీసిన అప్పులు..
Also Read
- CBSE స్టూడెంట్స్కు రిలీఫ్.. 10వ క్లాస్కు కొత్త రూల్ లేదు.!
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
ఈడీ అధికారాలపై సర్వోన్నత న్యాయస్థానం ముందుకు మంగళవారం కీలక విన్నపం వచ్చింది. మనీల్యాండరింగ్ కేసుల దర్యాప్తులో ఈడీకి ‘విస్తృతమైన అధికారాలు కల్పించారిని.. ఈ అధికారాలకు పగ్గాలు వేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. గురుగ్రామ్కు చెందిన రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎం3ఎంకి సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్లతో కూడిన ధర్మాసనానికి సీనియర్ న్యాయవాదులు ఈ విన్నపం చేయడం గమనార్హం. ఎం3ఎం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఈడీకి విస్తృతమైన అధికారాలు ఇచ్చారని.. కోర్టు గపేర వాటికి అడ్డుకట్టవేయకపోతే దేశంలో ఏ ఒక్కరూ భద్రంగా ఉండరని న్యాయవాదులన్నారు. ఈడీ విచారణకు వారు సహకరిస్తుంటే కూడా వారిని అరెస్ట్ చేశారని.. ఈ అరెస్టు వారి హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు. ఇటువంటి అధికారాలకు పగ్గాలు వేయాల్సిందేనని వివరించారు. ఎం3ఎం డైరెక్టర్లు బసంత్ బన్సాల్, పంకజ్ బన్సాల్ను మనీల్యాండరింగ్ కేసులో జూన్ 14న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి తరఫున సీనియర్ లాయర్లు హరీశ్ సాల్వే, ముకుల్ రోహత్గీలు కోర్టుకు హాజరయ్యారు. బన్సల్ సోదరులు ముందస్తు బెయిల్ కోసం పంజాబ్ హర్యానా హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, వారి పిటిషన్లను పరిష్కరించాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. మనీలాండరింగ్ విచారణలో మాజీ జడ్జిపై లంచం కేసుతో పాటు M3M డైరెక్టర్ల అరెస్ట్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై సవాళ్లతో సహా ఒక బ్యాచ్ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
Read also: BRO : పవన్ రేంజ్ మాములుగా లేదుగా.. భారీ స్థాయిలో జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్..?
మనీల్యాండరింగ్ కేసులో అరెస్టైన బన్సాల్ సోదరులకు పంచకుల పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. జూన్ 9న ఇదే కేసులో బసంత్,పంకజ్ బన్సల్లకు పంజాబ్ హరియాణ హైకోర్టు జూలై 5 వరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు మంజూరు చేసింది. అయినా సరే వారిని అరెస్ట్ చేశారని.. ఇటువంటి కస్టడీ చట్టవిరుద్ధమైన నిర్బంధానికి సమానమని, మనీలాండరింగ్ కేసులో బలవంతపు చర్య నుంచి తమకు రక్షణ కల్పిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టారని వారి తరఫున లాయర్లు వాదించారు. బన్సల్ సోదరులను అరెస్టైన కేసు.. పంచకులలో డైరెక్టర్గా నియమితులైన రూప్ కుమార్ బన్సాల్, మరొక వ్యక్తికి సంబంధించింది. ఈ కేసులో సీబీఐ మాజీ ప్రత్యేక న్యాయమూర్తి సుధీర్ పర్మార్పై ఏప్రిల్ 17న హరియాణా పోలీసు అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నిందితులకు అనుకూలంగా న్యాయమూర్తి పర్మార్ వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. ఏసీబీ కేసు నమోదు చేయడంతో పర్మార్ను విధుల నుంచి పంజాబ్ హరియాణా హైకోర్టు తప్పించిన విషయం తెలిసిందే.
- Tags
- ED
- Key Plea
- Powers
- Reined
- Supreme Court
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!