Air Pollution: ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఇది పూర్తిగా ప్రజల్ని చంపేస్తోందని, ఎంత మంది పిల్లలు నెబ్యులైబర్లపై ఉన్నారు.? అంటూ ప్రశ్నించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేవ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాన్ని నిషేధించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. దీనిపై శుక్రవారం తదుపరి విచారణ జరగనుంది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
Delhi: ఉత్తర భారత దేశంలో పెరుగుతున్న కాలుష్యం అక్కడ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే ఢిల్లీలో పెరిగిన కాలుష్యానికి పాఠశాలలు మూతబడ్డాయి. ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ తరుణంలో పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వివారాలలోకి వెళ్తే.. ప్రతి సంవత్సరం ఢిల్లీకి పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలలో పంట అవశేషాలను తగలబెడుతున్నారు. దీని కారణంగా ప్రతి శీతాకాలంలో ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా…
Delhi: ఢిల్లీలో కోరలు చాచిన గాలి కాలుష్యం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత వారం పది రోజులుగా ఢిల్లీలో కొనసాగుతున్న గాలి కాలుష్యం తార స్థాయికి చేరింది. దీనితో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావితం అవుతున్నాయి. చలికాలం ప్రారంభ లోనే కాలుష్య తీవ్రత రోజు రోజుకి తార స్థాయికి చేరుకోనంటోంది. ఉత్తర భారత దేశం లోని పలు ప్రాంతాలు కాలుష్యానికి అల్లాడుతున్నాయి. కాలుష్యం పెరగడం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.…
ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం సిఫారసు చేసింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందీప్ మెహతా పేర్లు ఉన్నాయి. వాస్తవానికి.. సుప్రీంకోర్టులో మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 34 కాగా, అందులో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అతనిపై ఉన్న పరువు నష్టం కేసుపై అత్యున్నత న్యాయస్థానం సోమవారం మధ్యంతర స్టే విధించింది. ఇదిలా ఉంటే.. ఈ కేసును గుజరాత్ నుంచి బదిలీ చేయాలని తేజస్వి యాదవ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తేజస్వి యాదవ్ బదిలీ పిటిషన్పై నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. గత ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని శ్రీనివాస్ గౌడ్ పై పిటిషన్ వేశారు. మహబూబ్ నగర్ వాసి రాఘవేందర్ రాజు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ను ఇటీవల తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాఘవేందర్ రాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే…
Same-Sex Marriage Case: స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం చట్టబద్ధమైన గుర్తింపుకు నిరాకరించింది. దీనిపై చట్టాలు రూపొందించే బాధ్యత పార్లమెంటుదే అని స్పష్టం చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును వెల్లడించింది. స్వలింగ పెళ్లిళ్లు చేసుకునే ప్రాథమిక హక్కు లేదని స్పష్టం చేసింది.
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం రాబోయే తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలపై ఢిల్లీ సహా ఎన్సీఆర్లోని ఐదు రాష్ట్రాల నుంచి అఫిడవిట్లను కోర్టు కోరింది.