Home
Supreme Court
Supreme Court News
-
40 అంతస్తుల ట్విన్ టవర్స్ను కూల్చివేయాలని సుప్రీం ఆదేశం!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 40 అంతస్తులు కట్టేశారు. వందల కోట్లు ధార పోశారు. చివరకు అది అక్రమమని తేలడంతో.. భవనాన్ని కూల్చివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుప్రీం ఆదేశాలతో దాన్ని నేలమట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు అధికారులు. నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన దేశ అత్యున్నత న్యాయ స్థానం.. ప్లాట్ ఓనర్లకు 12శాతం ఇంట్రెస్ట్తో డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఎమరాల్డ్… -
సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణస్వీకారం.. ఇలా ఇదే తొలిసారి..
సుప్రీం కోర్టులో తొలిసారి ఓ అరుదైన ఘటన జరిగింది.. కొత్తగా నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ… సుప్రీంకోర్టు కొత్త జడ్జీలతో ప్రమాణం చేయించారు. కాగా, సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేయడం ఇదే తొలిసారి. మరోవైపు.. కోవిడ్ నేపథ్యంలో ప్రమాణస్వీకార వేదికను ఒకటో కోర్టు ప్రాంగణం నుంచి అదనపు భవనం ఆడిటోరియంలోకి మార్చారు.. ఇక, జడ్జిల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని ప్రత్యక్ష… -
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం…
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా 9 మంది నేడు 10.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో 9 మంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటివరకు, సంప్రదాయంగా కోర్టు హాల్ 1 లో కొత్తగా నియామకమైన న్యాయమూర్తుల తో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయుస్తారు. అయుతే, ఇప్పుడు కోర్టు హాల్ 1 లో కాకుండా, సుప్రీం కోర్టు అనుబంధ భవన సముదాయంలో ఉన్న ఆడిటోరియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని… -
వచ్చే నెల నుండి సుప్రీం కోర్టులో ప్రత్యక్ష విచారణ…
సెప్టెంబర్ 1 నుంచి సుప్రీం కోర్టు “ప్రత్యక్ష విచారణ” పునరుద్దరణకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తి. ప్రాణాంతక “కోవిడ్” పరిస్థితికి అనుగుణంగా ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఉంది. సంబంధిత న్యాయమూర్తుల కమిటీ సిఫార్సులను ఆధారం చేసుకుని, బార్ అసోసియేన్స్ విజ్ఞప్తులను దృష్టి లో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి. ఈ మేరకు అధికార ప్రకటనను జారీ చేసింది సుప్రీం కోర్టు.… -
పేరుకుపోయిన పెండింగ్ కేసులు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ కేసుల భారీగా పెరిగిపోయాయి.. ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. దీంతో.. అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం కోసం చర్యలు ప్రారంభించింది ఏపీ సర్కార్.. దీనికోసం ఆన్లైన్ లీగల్ కేస్ మానీటరింగ్ సిస్టమ్ అనే కొత్త వ్యవస్థ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది..… -
కోర్టుల్లో భారీగా ఏపీ పెండింగ్ కేసులు.. రోజుకు సగటున 450 పిటిషన్లు..!
ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెండింగ్ కేసులు దాదాపు 2 లక్షలుగా ఉన్నాయి… ప్రస్తుతం హైకోర్టు, సుప్రీంకోర్టులో కలిపి వివిధ కోర్టుల్లో 1.94 లక్షల మేర పెండింగ్ కేసులు ఉన్నట్టు గుర్తించింది ప్రభుత్వం.. ఇక, దీనికి తోడు ప్రస్తుతం రోజూ సగటున 450 కొత్త దావాలు దాఖలవుతున్నాయని చెబుతున్నారు.. ఈ కొత్త పిటిషన్లకు సమాధానమివ్వడానికే ప్రతి రోజూ కనీసం 40 వేల పేజీల పేపర్వర్క్ చేయాల్సి వస్తోంది. మాపై లిటిగేషన్ల భారం ఎంత ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు… -
సుప్రీంకోర్టు జడ్జీలుగా 9 మందికి అవకాశం…
భారత అత్యున్నత న్యాయస్తానం సుప్రీంకోర్టులో 9 మందిని జడ్జీలుగా నియమించే అవకాశం ఉన్నది. దీనికి సంబందించి కొలీజియం 9 మంది పేర్లను సిఫారసు చేసింది. జస్టిస్ ఏఎస్ ఓకా(కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్), జస్టిస్ విక్రమ్నాథ్ (గుజరాత్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ జేకే మహేశ్వరి (సిక్కం హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ హిమా కొహ్లీ(తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్), జస్టిస్ బీవీ నాగరత్న( కర్ణాటక హైకోర్ట్ జడ్జి), జస్టిస్ సీటీ రవికుమార్ (కేరళ హైకోర్ట్ జడ్జి),… -
పెగాసస్.. కేంద్రం, బెంగాల్ సర్కార్కు సుప్రీం నోటీసులు
పెగాసస్ స్కామ్ వ్యవహారం భారత రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొత్తం పెగాసస్ వ్యవహారంలో అట్టుడికిపోయాయి. ఇక, ఈ వ్యవహారంలో విచారణకు ద్విసభ్య కమిషన్ వేసి.. పెగాసస్పై విచారణకు పూనుకున్న తొలి రాష్ట్రంగా వార్తల్లోని నిలిచింది పశ్చిమబెంగాల్.. అయితే, ఇవాళ కేంద్రంతో పాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.. ద్విసభ్య కమిషన్ విచారణ నిలుపుదల చేయాలంటూ “ప్రజా ప్రయోజన వ్యాజ్యం” దాఖలు అయ్యింది.. జస్టిస్ మదన్ బీ లోకూర్… -
కొలీజియం సిఫార్సు.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రేసులో ముగ్గురు మహిళలు..!
9 మంది న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది కొలీజియం.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఈ సిఫార్సులు చేసింది.. తొమ్మిది మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు.. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.. జస్టిస్ విక్రమ్ నాధ్ ( గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ బి.వి. నాగరత్న… -
రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు.. 48 గంటల్లో..!
క్రిమినల్ రికార్డులు ఉన్న నేతలే.. ప్రభుత్వాల్లో కీలక పదవులు చేపడుతున్నారు.. ప్రజలను పాలిస్తున్నారు.. అయితే, రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం… ఈ మేరకు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ బీఆర్ గవాయ్లతో కూడి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 13వ తేదీన ఇచ్చిన…
తాజావార్తలు
-
Seediri Appalaraju: కూటమి అభద్రతా భావానికి తప్పుడు కేసులే నిదర్శనం: సీదిరి అప్పలరాజు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్కు వెళ్లాక ప్రియుడితో స్టాల్కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
-
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
-
Vijay Mallya: వేల కోట్లు ఎగగొట్టి పోయిన విజయ్ మాల్యా చుట్టూ మళ్లీ హాట్ టాపిక్.. ఎంత వసూలైంది? ఎంత మిగిలిందంటే?
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!