Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
- బ్రిటిష్ పోలీసుల తూటాలకు ఎదురొడ్డిన ధీరురాలు..
- జాతీయ జెండా వదలని వీరనారి మాతంగిని హజ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matangini Hazra: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది వీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. వారిలో మహిళల పాత్ర కూడా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. అలాంటి ధీరవనితల్లో మాతంగిని హజ్రా ఒకరు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆమె.. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో పోలీసుల తూటాలకు ఎదురొడ్డి ప్రాణత్యాగం చేశారు. చివరి క్షణం వరకు చేతిలో జాతీయ జెండాను పట్టుకుని పోరాడిన ఆమెను అందరూ ప్రేమగా ‘గాంధీ బురి’ అని పిలిచేవారు. ‘గాంధీ బురి’ అనేది బెంగాలీ పదం. తెలుగులో దీని అర్థం ఏమిటంటే.. “వృద్ధ మహిళా గాంధీ”. బెంగాలీ భాషలో ‘బురి’ (Buri) అంటే వృద్ధురాలైన మహిళ అని అర్థం. మాతాంగిని హజ్రా గారు తన 60 ఏళ్ల వయసులో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ మహాత్మా గాంధీ ఆశయాలను, అహింసా మార్గాన్ని నమ్మి, ఆయన బాటలోనే నడిచారు. సరిగ్గా గాంధీజీ లాగే నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ, ఖాదీ బట్టలు ధరిస్తూ, ప్రజలను చైతన్య పరిచేవారు. దేశం కోసం ఆమె చూపిన సాహసానికి, గాంధీజీ పట్ల ఆమెకున్న అంకితభావానికి గౌరవంగా బెంగాల్ ప్రజలు ఆమెను ప్రేమతో ‘గాంధీ బురి’ అని పిలుచుకున్నారు.
పేద కుటుంబంలో పుట్టి.. చిన్న వయసులోనే వివాహం
మాతంగిని హజ్రా 1870 అక్టోబర్ 19న బెంగాల్లోని తమ్లుక్ సమీపంలోని హోగ్లా గ్రామంలో ఓ పేద రైతు కుటుంబంలో జన్మించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమెకు పెద్దగా విద్యాభ్యాసం చేసే అవకాశం లభించలేదు. కేవలం 12 ఏళ్ల వయసులో త్రిలోచన్ హజ్రాతో వివాహం జరిగింది. అయితే 18 ఏళ్ల వయసులోనే భర్తను కోల్పోయి వితంతువుగా మారారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైన మాతంగిని హజ్రా స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అనంతరం చౌకీదారీ పన్ను వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టడంతో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమె భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీలకంగా మారారు. ఖాదీని ప్రోత్సహించడంతో పాటు సామాజిక సేవలోనూ పాల్గొన్నారు. 1933లో శ్రీరాంపూర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పోలీసులు జరిపిన లాఠీచార్జిలో ఆమె గాయపడ్డారు. అయినప్పటికీ ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు.
Also Read
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
- Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
- Janmashtami 2026 Fasting Rules: కృష్ణ జన్మాష్టమి 2026.. ఉపవాసం నుంచి నిశీథి పూజ వరకు పూర్తి వివరాలు
72 ఏళ్ల వయసులోనూ వేల మందికి నాయకత్వం
1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతమైన సమయంలో మాతంగిని హజ్రా మరోసారి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంలో ముందుండారు. తమ్లుక్ పోలీస్ స్టేషన్ను స్వాధీనం చేసుకునే లక్ష్యంతో నిర్వహించిన భారీ ర్యాలీకి ఆమె నాయకత్వం వహించారు. సుమారు 6 వేల మంది ఈ ఊరేగింపులో పాల్గొన్నట్లు చారిత్రక వివరాలు చెబుతున్నాయి. వారిలో ఎక్కువ మంది మహిళలే. ర్యాలీ తమ్లుక్ పట్టణ శివార్లకు చేరుకోగానే బ్రిటిష్ పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని, వెంటనే వెనక్కి వెళ్లాలని హెచ్చరించారు. అయినప్పటికీ మాతంగిని హజ్రా వెనక్కి తగ్గలేదు. చేతిలో త్రివర్ణ పతాకంతో ముందుకు సాగారు. ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. మాతంగిని హజ్రాపై కూడా కాల్పులు జరిగాయి. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. పలుమార్లు తూటాలు తగిలి తీవ్రంగా గాయపడినా చేతిలోని జాతీయ జెండాను మాత్రం ఆమె వదల్లేదు. చివరి క్షణాల్లో కూడా ‘వందేమాతరం’, ‘భారత మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ జెండాను ఎగురవేస్తూనే ఆమె ప్రాణాలు విడిచారని చరిత్ర చెబుతుంది. 1942 సెప్టెంబర్ 29న జరిగిన ఈ ఘటన ఆమెను స్వాతంత్ర్య ఉద్యమంలో చిరస్మరణీయ వీరనారిగా నిలిపింది.
మాతంగిని హజ్రా గాంధేయ సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధత కారణంగా బెంగాలీలో ‘గాంధీ బురి’ అనే ఆప్యాయమైన పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆమె త్యాగం తమ్లుక్ ప్రాంతంలోని స్వాతంత్ర్య ఉద్యమానికి మరింత స్ఫూర్తినిచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మాతంగిని హజ్రా జ్ఞాపకార్థం పలు ప్రాంతాల్లో పాఠశాలలు, వీధులు, కాలనీలకు ఆమె పేరు పెట్టారు. కోల్కతాలోని హజ్రా రోడ్ కూడా ఆమె పేరుతోనే ప్రసిద్ధి చెందింది. 1977లో కోల్కతాలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తమ్లుక్లో ఆమె ప్రాణత్యాగం చేసిన ప్రాంతంలోనూ స్మారక విగ్రహం ఉంది. 2002లో భారత తపాలా శాఖ మాతంగిని హజ్రా చిత్రంతో పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 2015లో తమ్లుక్లో షాహిద్ మాతంగిని హజ్రా గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ను ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా బ్రిటిష్ తూటాలకు ఎదురొడ్డి నిలిచిన మాతంగిని హజ్రా త్యాగం.. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగానే నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
Bigg Boss Telugu 10: కింగ్ నాగార్జునకు కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. బిగ్ బాస్ 10 కోసం ఎన్ని కోట్లంటే?
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!