దేశ వ్యాప్తంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేసి బైకులు, కార్లను తగలబెట్టారు.
Stone Pelting During Navratri: గుజరాత్ రాష్ట్రంలోని ఖేడా జిల్లాలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న గర్బా డ్యాన్స్ వేదికపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఖేడా జిల్లాలోని మాటర్ తాలూకాలోని ఉండేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల్లో రాళ్లదాడి జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మరింత ఉద్రిక్తతలు తెలత్తకుండా పోలీసులు గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.