Today (24-12-22) Business Headlines: శ్రీరామ్ ఆల్ ఇన్ ఒన్ ఆర్థిక సేవలు: శ్రీరాం ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్ విలీనమై శ్రీరాం ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు వివిధ లోన్ల కోసం వేర్వేరు శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపట్టారు. అన్ని బ్రాంచిల్లో అన్ని రకాల ఆర్థిక సేవలు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ఎండీ అండ్ సీఈఓ వైఎస్ చక్రవర్తి వెల్లడించారు.
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.