Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.
ఒక్క ఆగస్టు నెలలోనే మీషో యూజర్ల సంఖ్య 127 మిలియన్లకు పైగా నమోదుకావటం గమనించాల్సిన విషయం. దీంతో ఈ యూనికార్న్ కస్టమర్ మరియు సెల్లర్ గ్రోత్ ఈ రేంజ్లో పెరగటం వెనక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మీషోని సెల్లర్స్కి దగ్గర చేస్తున్న ముఖ్యాంశం ‘వేగం’ అని తేలింది. ఈ యాప్ని ఇప్పటివరకు 360 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 175 మిలియన్ డౌన్లోడ్లు గత ఏడాది వ్యవధిలోనే జరగటం విశేషం.
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
read also: UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
తగ్గుతూనే ఉన్న ఫారెక్స్ నిల్వలు
ఇండియా విదేశీ మారక నిల్వలు అంతకంతకూ తగ్గుతూనే ఉన్నాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ దాదాపు 522 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 54 వేల 562 కోట్ల డాలర్లకు పడిపోయాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో దీన్ని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న చర్యల కారణంగా విదేశీ మారక నిల్వలు పతనమవుతున్నాయి.
లక్షల కోట్లు ఆవిరి
ఇండియన్ స్టాక్ మార్కెట్లపై విదేశీ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావం బాగా పడింది. దీంతో నిన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 5 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ వెయ్యీ 20 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17 వేల 400లకు దిగువకు పరిమితం కావాల్సి వచ్చింది. పవర్, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఏడాది సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ వర్గాలను భయాందోళనలకు గురిచేశాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!