Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.
ఒక్క ఆగస్టు నెలలోనే మీషో యూజర్ల సంఖ్య 127 మిలియన్లకు పైగా నమోదుకావటం గమనించాల్సిన విషయం. దీంతో ఈ యూనికార్న్ కస్టమర్ మరియు సెల్లర్ గ్రోత్ ఈ రేంజ్లో పెరగటం వెనక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మీషోని సెల్లర్స్కి దగ్గర చేస్తున్న ముఖ్యాంశం ‘వేగం’ అని తేలింది. ఈ యాప్ని ఇప్పటివరకు 360 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 175 మిలియన్ డౌన్లోడ్లు గత ఏడాది వ్యవధిలోనే జరగటం విశేషం.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
- Family Vacation: యూరప్ను తలపించేలా నేపాల్ గ్రామాలు.. తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ట్రిప్కు బెస్ట్!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
read also: UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
తగ్గుతూనే ఉన్న ఫారెక్స్ నిల్వలు
ఇండియా విదేశీ మారక నిల్వలు అంతకంతకూ తగ్గుతూనే ఉన్నాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ దాదాపు 522 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 54 వేల 562 కోట్ల డాలర్లకు పడిపోయాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో దీన్ని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న చర్యల కారణంగా విదేశీ మారక నిల్వలు పతనమవుతున్నాయి.
లక్షల కోట్లు ఆవిరి
ఇండియన్ స్టాక్ మార్కెట్లపై విదేశీ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావం బాగా పడింది. దీంతో నిన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 5 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ వెయ్యీ 20 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17 వేల 400లకు దిగువకు పరిమితం కావాల్సి వచ్చింది. పవర్, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఏడాది సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ వర్గాలను భయాందోళనలకు గురిచేశాయి.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!