Crorepati Factory Meesho: మీషోది మామూలు షో కాదు. కోటీశ్వరుల తయారీ ఫ్యాక్టరీగా అరుదైన గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crorepati Factory Meesho: మన దేశంలోని మొట్టమొదటి సోషల్ కామర్స్ ప్లాట్ఫాం అయిన మీషో.. లక్షాధిపతులను తయారుచేసే ఫ్యాక్టరీగా పేరొందుతోంది. ఇప్పటివరకు లక్షా 23 వేల మంది చిన్న వ్యాపారులను లక్షాధికారులను చేసింది. టయర్-2 నుంచి టయర్-4 సిటీల వరకు యూజర్ పెనట్రేషన్ విషయంలో మీషో.. అమేజాన్ మరియు ఫ్లిప్కార్ట్లను అధిగమించింది. యాప్ సైజ్, డూయింగ్ బిజినెస్ వీడియోలు, మంత్లీ విజిట్స్తో మీషో రూరల్ ఏరియాల్లోకి కూడా శరవేగంగా విస్తరిస్తోంది.
ఒక్క ఆగస్టు నెలలోనే మీషో యూజర్ల సంఖ్య 127 మిలియన్లకు పైగా నమోదుకావటం గమనించాల్సిన విషయం. దీంతో ఈ యూనికార్న్ కస్టమర్ మరియు సెల్లర్ గ్రోత్ ఈ రేంజ్లో పెరగటం వెనక ఉన్న సక్సెస్ సీక్రెట్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మీషోని సెల్లర్స్కి దగ్గర చేస్తున్న ముఖ్యాంశం ‘వేగం’ అని తేలింది. ఈ యాప్ని ఇప్పటివరకు 360 మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో 175 మిలియన్ డౌన్లోడ్లు గత ఏడాది వ్యవధిలోనే జరగటం విశేషం.
Also Read
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
- Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
- Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
read also: UPI Lite: పిన్, మొబైల్ డేటా లేకున్నా ‘లైట్’ తీసుకోండి. యూపీఐ పేమెంట్ చేసేయండి.
తగ్గుతూనే ఉన్న ఫారెక్స్ నిల్వలు
ఇండియా విదేశీ మారక నిల్వలు అంతకంతకూ తగ్గుతూనే ఉన్నాయి. ఈ నెల 16వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ రిజర్వ్ దాదాపు 522 కోట్ల డాలర్లు తగ్గింది. దీంతో విదేశీ మారక నిల్వలు ప్రస్తుతం 54 వేల 562 కోట్ల డాలర్లకు పడిపోయాయి. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో దీన్ని నివారించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతున్న చర్యల కారణంగా విదేశీ మారక నిల్వలు పతనమవుతున్నాయి.
లక్షల కోట్లు ఆవిరి
ఇండియన్ స్టాక్ మార్కెట్లపై విదేశీ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు ప్రభావం బాగా పడింది. దీంతో నిన్న ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 5 లక్షల కోట్లు ఆవిరైంది. సెన్సెక్స్ వెయ్యీ 20 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17 వేల 400లకు దిగువకు పరిమితం కావాల్సి వచ్చింది. పవర్, రియల్టీ, బ్యాంకింగ్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈ ఏడాది సూచీల లాభాలన్నీ కరిగిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్ వర్గాలను భయాందోళనలకు గురిచేశాయి.
తాజావార్తలు
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..