Home
Srisailam Temple
Srisailam Temple News
-
శ్రీశైలంలో పెద్దపులి సంచారం..!
కర్నూలు జిల్లా శ్రీశైలం ముఖద్వారం సమీపంలో పెద్దపులి సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్ద పులి కనిపించింది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. వాహనాలు నిలిపివేసి ఫోటోలు, వీడియోలు తీసిన ప్రయాణికులు. ఎన్టీవీ చేతిలో వీడియోలు వున్నాయి. పెద్ద పులి ఎటు నుంచి ఎటు వెళ్ళిందోనని టెన్షన్ పడుతున్నారు. అటవీ అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. -
శ్రీశైలంలో కార్తీకమాస శోభ.. భక్తులతో ఆలయం కిటకిట..
కార్తీక మాసం లయకారుడు శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల. ఈ నెలలో పెద్ద ఎత్తున్న భక్తులు శివాలయాలను దర్శించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ఈ రోజు భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటికిటలాడింది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీక మాస ఉత్సవాలు కొనసాగనున్నాయి. స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన… -
శ్రీశైలంలో క్షురకుల చేతివాటం.. ఈవో సీరియస్
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. శ్రీశైలంలో నిబంధనలకు విరుద్ధంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన కళ్యాణకట్ట సిబ్బంది తీరు విమర్శలకు కారణం అవుతోంది. ఆలయం కేశఖండనశాలలో భక్తులు తలనీలాలు ఇస్తుంటారు. అక్కడ చేతివాటం చూపించారు 12 మంది క్షురకులు. దేవస్థానం ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను పరిశీలించిన ఈవో లవన్న ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు. చేతివాటానికి పాల్పడిన 12 మంది క్షురకులను విధుల నుంచి తాత్కాలికంగా నిలుపుదల… -
భక్తులకు షాక్.. శ్రీశైలంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేత..
శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కార్తీకా మాసం. రానున్న కార్తీక మాసోత్సవాల సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5 నుంచి డిసెంబర్ 4 వరకు కార్తీకమాసం సందర్భంగా కార్తీకమాసోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు. ఈ నేపథ్యంలో స్వామి వారి స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రూ.5వేల గర్భాలయ అభిషేకం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
గత కొన్ని రోజులగా శ్రైశైలం జలాశయానికి వరదనీరు రాగా, ప్రస్తుతం వరద ఉద్ధృతి తగ్గుతోంది. ఎగువన ఉన్న జలాశాయల్లోకి వరద నీరు తగ్గడంతో గేట్లు మూసి వేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి వస్తున్న ఇన్ఫ్లో: 16,135 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో : 70,831 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. శ్రైశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 880.10 అడుగులుగా కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు… -
శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది.. కరోనా మహమ్మారి కారణంగా స్పర్శ దర్శనం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే కాగా.. దసరా మహోత్సవాల ప్రారంభం నుంచి తిరిగి.. సామాన్య భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనాన్ని కల్పించనున్నట్లు ప్రకటించింది శ్రీశైలం దేవస్థానం.. అంటే, అక్టోబర్ 7వ తేదీ నుంచి భక్తులందరికీ స్పర్శ దర్శనం అవకాశం ఇవ్వనున్నట్లు టెంపుల్ అధికారులు పేర్కొన్నారు. కాగా, వారంలో 4 రోజుల పాటు మంగళవారం నుంచి శుక్రవారం వరకు సర్వదర్శనం… -
శ్రీశైలం ఆలయ ప్రతిష్ట దిగజార్చితే కఠిన చర్యలు..
సోషల్ మీడియాలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఏదిపడితే అది పెడుతూ ఆందోళనకు గురిచేసేవాళ్లు కొందరైతే.. మతవిశ్వాసాలను దెబ్బకొట్టే విధంగా.. రెచ్చగొట్టే విధంగా.. దేవుళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలు.. ఇలా అన్నింటిపై పోస్టులు పెట్టేవారు ఉన్నారు. అయితే, ఈ మధ్య కొందరు ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంపై కూడా పోస్టులు పెడుతున్నారు.. వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. శ్రీశైలం ఆలయ ప్రతిష్ట దిగజార్చే పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు శిల్పా చక్రపాణిరెడ్డి.. దేవస్థానంపై అసత్య ప్రచారం… -
శ్రీశైల మల్లన్న భక్తులకు గుడ్న్యూస్.. నేటి నుంచి…
శ్రీశైల మల్లన్న భక్తులకు గుడ్న్యూస్ చెప్పారు అధికారులు.. ఇవాళ్టి నుంచి భక్తులకు సర్వ దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. అయితేచ, కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా గర్భాలయ అభిషేకాలను ఏడు విడుతలుగా, సామూహిక అభిషేకాలు నాలుగు విడుతలుగా కల్పించాలని నిర్ణయించారు. అలాగే వీఐపీ బ్రేక్ దర్శనాలు మూడు విడుతలుగా కల్పించనున్నారు. అభిషేకంతో పాటు దేవాలయంలో జరిగే సేవల టికెట్లన్నీ ఆన్లైన్, కరెంటు బుకింగ్ ద్వారా… -
శ్రీశైలం మల్లన్న సేవలో అమిత్షా
కేంద్ర హోంమంత్రి అమిత్షా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు… ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ ఎయిర్పోర్ట్కు కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆయన.. ఆ తర్వాత హెలికాప్టర్లో శ్రీశైలం చేరుకున్నారు.. అక్కడ షాకు ఘనస్వాగతం లభించింది.. ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ వాని మోహన్, బీజేపీ నేతలు ఆదినారాయణ రెడ్డి, అంబాల ప్రభాకర్ రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.. ఇక, ఆ తర్వాత శ్రీశైలం… -
శ్రీశైలం మల్లన్న దర్శనానికి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.. ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీశైలం వెళ్లనున్నారు.. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్షా… ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అక్కడే లంచ్ చేసి.. తిరిగి హెలికాప్టర్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్న ఆయన.. అనంతరం తిరిగి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు.. మొత్తంగా..…
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!