Srilanka Economic Crisis: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో జూలై 9న పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే ఈ సమయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం నుంచి పారిపోయారు. జూలై 13న మాల్దీవులకు పారిపోయిన రాజపక్స.. తిరిగి అక్కడ నుంచి సింగపూర్ చేరుకున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే గొటబయ రాజపక్స స్వదేశానికి వస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రి, కేబినెట్ అధికార ప్రతినిధి వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు…
దాదాపుగా వారం పాటు ఆందోళకారులు అధ్యక్ష భవనంలోనే ఉంటూ.. అక్కడే మద్యం తాగడం, వంట చేసుకుని తినడం, స్మిమ్మింగ్ చేయడం వంటివి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగవైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ఇప్పుడో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అధ్యక్ష భవనం, ప్రధానమంత్రి ఇంటిలో ఉన్న దాదాపు 1000కి పైగా పురాతన కళాఖండాలు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై అక్కడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వీటి విలువ కూడా ఎక్కువగానే ఉంటుందని శ్రీలంక పోలీసులు…
శ్రీలంక ఆర్థిక సంక్షోభం అక్కడి మహిళల పాలిట నరకంగా మాారాయి. నిత్యావసరాలు, మందుల కోసం శరీరాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ బిడ్డలు, తమను నమ్ముకుని ఉన్నవారి ఆకలి తీర్చేందుకు వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అక్కడి ఆర్థిక సంక్షోభం శ్రీలంక మహిళలను దీనస్థితిలోకి నెట్టేశాయి. శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిన తరువాత వస్త్ర పరిశ్రమల్లో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి నెట్టబడుతున్నారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
శ్రీలంక ఆర్థిక సంక్షోభం.. ప్రజల తీవ్ర ఆందోళనల నేపథ్యంలో గత శనివారం అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లారు. ఇటీవల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అబేవర్థనకు పంపాడు. తాజాగా సంక్షోభం నేపథ్యంలో శనివారం శ్రీలంక పార్లమెంట్ సమావేశం అయింది. గొటబాయ రాజపక్స రాజనీమా లేఖను పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ ధమ్మిక దసనాయకే చదివి వినిపించారు. ‘‘శ్రీలంకను చుట్టుముట్టిన ఆర్థిక…
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన నాయకుడే పరారయ్యాడు. ప్రజలు నిరసనల మధ్య శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులు..అక్కడ నుంచి సింగపూర్ కు వెళ్లాడు. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. రాజపక్స రాజీనామా చేయడంతో శ్రీలంకలో ప్రజలు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను తగ్గించారు. ప్రభుత్వ భవనాలను కూడా ఆందోళనకారులు ఖాళీ చేశారు. ఈ రోజు శ్రీలంక పార్లమెంట్ సమావేశం కాబోతోంది. కొత్త అధ్యక్షుడి…
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పటికే దేశం వదిలిపారిపోయిన గొటబాయ రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాల్దీవుల నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ వెళ్లిన రాజపక్స తన రాజీనామా లేఖను పాక్స్ ద్వారా పార్లమెంట్ స్పీకర్ కార్యాలయానికి పంపించారు. తాజాగా ఈ రోజు స్పీకర్ మహిందా యాప అబేదర్థనే అధ్యక్షుడి రాజీనామాపై అధికార ప్రకటన చేయనున్నారు. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత శ్రీలంక నిరసనకారుల్లో ఆనందం కనిపిస్తోంది.…
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవుల రాజధాని మాలే నుంచి సింగపూర్ పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక నుంచి మాల్దీవులకు పారిపోయారు గొలబాయ రాజపక్స. ఆయన భార్య ఇద్దరు బాడీగార్డులతో ఆయన మాలే చేరుకున్నారు. ఇదిలా ఉంటే అధ్యక్షుడు పారిపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆందోళనలను ఇంకా పెంచారు. ఏకంగా ప్రధాని, తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే…
శ్రీలంకలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం వదిలి పారిపోవడంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. ఒక్కసారిగా జనాలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని కొలంబో ప్రజల ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. ఏకంగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు ఆందోళనకారులు. ప్రధాని నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో భద్రతా బలగాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. టియర్ గ్యాస్ తో జనాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి…