Imran Khan: పాకిస్తాన్ లో కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు రాజకీయంగా, ఆర్ధికంగా దేశాన్ని దివాలా తీయిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం మూడు నెల్లలోనే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని.. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ను దోచుకుంటున్నారు అని ట్విట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Read Also: Vishnu Vishal: భర్త నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గుత్తా జ్వాల
Also Read
- Trump-Netanyahu: ట్రంప్నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టి ఓడించాయి ప్రతిపక్షాలు. ఆ తరువాత పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పటి నుంచే పాక్ నెమ్మదిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ అప్పులు ఎక్కువ కావడంతో పాటు.. దేశంలో ద్రవ్యోల్భనం పెరిగి నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ఇదిలా ఉంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టేంకేందుకు టీ పొడి, ఇతర లగ్జరీ వస్తువుల దిగుమతిని తగ్గించింది పాక్. చివరకు ఇంధన కొరతతో విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. సాయంత్రం వరకే షాపింగ్ మాల్స్, ఆఫీసులు పనిచేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇక రాజకీయంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్థిరంగా లేదు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ వరసగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా దివాలా తీయడం కాస్త ఆలస్యం కావచ్చమో కానీ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం పక్కా అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!