Imran Khan: పాకిస్తాన్ లో కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని శ్రీలంక అల్లాడుతోంది. శ్రీలంక తరువాత ఏ దేశం అంటే వినిపించే పేరు పాకిస్తాన్. అయితే అక్కడ కూడా శ్రీలంక తరహా ఉద్యమం వస్తుందని మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ శనివారం హెచ్చరించారు. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చే రోజు దగ్గర్లో ఉందంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆసిఫ్ జార్దారీ, షరీఫ్ కుటుంబాలు మూడు నెల్లలోనే తాము అక్రమంగా సంపాదించిన సంపదను కాపాడుకునేందుకు రాజకీయంగా, ఆర్ధికంగా దేశాన్ని దివాలా తీయిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం మూడు నెల్లలోనే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని.. 30 ఏళ్లుగా పాకిస్తాన్ ను దోచుకుంటున్నారు అని ట్విట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Read Also: Vishnu Vishal: భర్త నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన గుత్తా జ్వాల
Also Read
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
- Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మాణం పెట్టి ఓడించాయి ప్రతిపక్షాలు. ఆ తరువాత పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ పదవిలో ఉన్నప్పటి నుంచే పాక్ నెమ్మదిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ అప్పులు ఎక్కువ కావడంతో పాటు.. దేశంలో ద్రవ్యోల్భనం పెరిగి నిత్యావసరాలు, పెట్రోల్ ధరలు పెరిగాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో పెట్రోల్ ధరలు ఆల్ టైం హైకి చేరాయి. ఇదిలా ఉంటే ఆర్థిక కష్టాల నుంచి గట్టేంకేందుకు టీ పొడి, ఇతర లగ్జరీ వస్తువుల దిగుమతిని తగ్గించింది పాక్. చివరకు ఇంధన కొరతతో విద్యుత్ కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. సాయంత్రం వరకే షాపింగ్ మాల్స్, ఆఫీసులు పనిచేయాలని అక్కడి ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ఇక రాజకీయంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం స్థిరంగా లేదు. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇమ్రాన్ ఖాన్ వరసగా ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. పాకిస్తాన్, శ్రీలంక మాదిరిగా దివాలా తీయడం కాస్త ఆలస్యం కావచ్చమో కానీ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం పక్కా అని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..