ఏపీలో అధికారపార్టీ ఎన్నికల మూడ్లోకి వచ్చేసింది. ప్రభుత్వపరంగా, పార్టీ రీత్యా అంతా సెట్ చేస్తున్నరు అధినేత. ఇప్పటి నుంచే నేతలు, ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లాలని.. ప్రజలతో మమేకం కావాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు శ్రీకాకుళం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు కృష్ణదాస్కు భారంగా మారబోతున్నట్టు టాక్. సౌమ్యుడిగా పేరున్న ఆయన గ్రూపుల గోలను ఏ విధంగా సెట్ చేస్తారో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఒకటి…
లాక్ డౌన్.. పేరు చెబితే జనం ఉలిక్కిపడుతుంటారు. కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధిస్తే వేలాదిమంది చనిపోయారు. వైరస్ కంటే లాక్ డౌన్ కారణంగా తిండి లేక, తమ స్వస్థలాలకు వెళుతూ దారిలో ప్రాణాలు పోయిన అభాగ్యులెందరో. అయితే శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామంలో ఇప్పటికీ లాక్ డౌన్ అమలవుతోంది. 8రోజుల పాటు ఎవరూ ఊరి పొలిమేర దాటకుండా… బయటవారిని లోపలికి రానీయకుండా గ్రామస్తులు స్వీయ నిర్భందం విధించుకున్నారు. దుష్టశక్తులు పీడిస్తున్నాయని నమ్మిన జనం,…
ప్రసాదరావు అభినందన సభకు రాని కృష్ణదాస్, తమ్మినేని..! శ్రీకాకుళం జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు మొదటి నుంచీ ఉన్నాయ్. ధర్మాన సోదరుల మధ్యే సఖ్యత లేదు. తాజా మంత్రివర్గ విస్తరణతో నేతల మధ్య ఆ అంతరం ఇంకా పెరిగిందట. మంత్రిగా ప్రమాణం చేసి జిల్లాకు వచ్చిన ధర్మాన ప్రసాదరావు అభినందన సభకు అందరినీ రావాలని ఆహ్వానించారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలకు ధర్మాన కీలక అనుచరులు ఫోన్లు చేశారు. అయితే ఆ సమావేశానికి నరసన్నపేట.. ఆమదాలవలస…
మంత్రిగా మారాక ధర్మాన ప్రసాదరావు తన శాఖపై పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి రెవిన్యూశాఖ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన. నిజాయితి గల పరిపాలన ప్రజలకు ఇవ్వాలన్నారు. త్వరితగతిన సేవలు అందించాలి. దీనికోసం వ్యక్తులు లేదా వ్యవస్థలను సంస్కరించాలన్నారు. ప్రజలనుండి రెవిన్యూ శాఖ పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, రెవిన్యూ శాఖని అన్నానంటే .నేను కూడా…
మర్మం లేకుండా మాట్లాడేస్తారు. మెలితిప్పే కామెంట్స్ అస్సలు ఉండవు. సూటిగా సుత్తిలేకుండా చెప్పేస్తారు. ఇన్నాళ్లూ ఆయన ఏం చెప్పినా చర్చే. ఇప్పుడు మాత్రం ఆయన మంత్రి. అభినందన సభలోనే నర్మగర్భ వ్యాఖ్యలతో కలకలం రేపారు. కాకపోతే ఆ ధర్మ సూక్తులు ఎవరికన్నదే ప్రస్తుతం ప్రశ్న. హాట్ టాపిక్గా మంత్రి ధర్మాన కామెంట్స్ ధర్మాన ప్రసాదరావు. తాజా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కించుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత మంత్రి హోదాలో జిల్లాకు రావడంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు శ్రీకాకుళం…
వైసీపీ కార్యకర్తపై మంత్రి ధర్మాన చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా ధర్మాన ప్రసాదరావు శుక్రవారం నాడు శ్రీకాకుళంలో పర్యటించారు. దాదాపు 8 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి చేపట్టిన ధర్మాన ప్రసాదరావును కలిసేందుకు భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మానతో కరచాలనం చేసేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ సమయంలో ఓ వైసీపీ కార్యకర్త మంత్రి ధర్మాన…
రెవిన్యూ శాఖలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు. అవినితి ఎక్కువగా ఉందని, ఇది అవమానకరంగా ఉందన్నారాయన.. అందుకే అనేక పథకాలను.. లబ్ధిదారులకే నేరుగా ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. అయితే, ఇదే సందర్భంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ధర్మాన.. ప్రజలు నిజాయితీ కలిగిన నాయకులను కోరుకుంటున్నారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్ ను ప్రజలు నాలుగు సార్లు ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేసిన ఆయన.. ఇది కేవలం ఆయన నిజాయితీవల్లే సాధ్యమైందన్నారు. ఢిల్లీలో ఆప్…
ఏపీలో కేబినెట్ కూర్పు తర్వాత అసంతృప్తి బయటపడుతూనే వుంది. కేబినెట్లో మార్సులు, కొత్త మంత్రులపై విపక్షాలు మండిపడుతూనే వున్నాయి. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కేబినెట్ కూర్పులో అవమానించబడ్డ చాలా మంది ఓదార్పు కోరుకుంటున్నారన్నారు. బాధల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం రాజకీయాల్లో సహజం అన్నారు. త్వరలో బీజేపీలోకి విస్త్రతమైన చేరికలు ఉంటాయని జోస్యం చెప్పారు ఎంపీ జీవీఎల్. బీజేపీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమైన ఎవరికైనా తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తూర్పు…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు…